ఉద్యోగులకు అభయహస్తం ఇచ్చిన ఆస్ట్రేలియా ప్రభుత్వం

Webdunia
సోమవారం, 30 మార్చి 2020 (18:21 IST)
ప్రపంచం కరోనా వైరస్ భయంతో వణికిపోతోంది. ఈ వైరస్ బారినపడి అనేక మంది మృత్యువాతపడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియాలో చేస్తున్న ఉద్యోగులందరికీ ఈ నిర్ణయం ఎంతో ఉపశమనం కలిగించనుంది. 
 
నిజానికి కరోనా వైరస్ దెబ్బకు అనేక కంపెనీలు ఉద్యోగులను వదిలించుకునే పనిలో ఉన్నాయి. కానీ, ఆస్ట్రేలియాలో మాత్రం ఉద్యోగులంతా ప్రస్తుతం చేస్తున్న పనుల్లోనే కొనసాగేలా చర్యలు తీసుకోనుంది. 
 
అందులో భాగంగా ఉద్యోగులందరికీ ప్రతి రెండు వారాలకు 1500 డాలర్ల వేతన సబ్సిడీ ఇస్తామని, అంత మొత్తం ఉద్యోగికి సంస్థ ఇచ్చే వేతనం నుంచి మినహాయించుంటాయని వెల్లడించారు. ప్రజలు తమకు అత్యవసరమైతేనే ఇండ్లనుంచి బయటకు రావాలని సూచించారు. 
 
ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ సోమవారం భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. వ్యాపారాలు, ఉద్యోగులకు చేయూతనిచ్చేందుకు 130 బిలియన్‌ ఆస్ట్రేలిలియన్‌ డాలర్లను కేటాయించినట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments