Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌదీలో కేరళ వాసుల హత్య... ముగ్గురికి బహిరంగ శిరచ్ఛేదం

Webdunia
మంగళవారం, 23 అక్టోబరు 2018 (09:21 IST)
కేరళ రాష్ట్రానికి చెందిన ఐదుగురుని చిత్రహింసలకుగురిచేసి సజీవంగా పాతిపెట్టిన కేసులో దోషులుగా తేలిన ముగ్గురికి బహిరంగ శిరచ్ఛేద శిక్షను సౌదీ ప్రభుత్వం అమలు చేసింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
గత 2014లో ఒక సౌదీ అరేబియా రైతు తన వ్యవసాయ భూమిలో పైపులను భూమిలో వేసేందుకు తవ్వుతుండగా కొన్ని ఎముకలు బయటపడ్డాయి. తొలుత జంతువుల ఎముకలుగా భావించారు. ఆ తర్వాత అస్థిపంజరం లభించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన సౌదీ పౌలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో మరో నాలుగు అస్థిపంజరాలు లభించాయి. అందులో కొందరి నోటికి టేపులు చుట్టి, కాళ్లు చేతులు తాళ్లతో కట్టేసి ఉండటం గమనించారు.
 
అస్థిపంజరాల సమీపంలో లభ్యమైన వీసా కార్డు ఆధారంగా మరింత లోకుగా దర్యాప్తు చేపట్టగా మృతులంతా కేరళ రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించారు. తన కూతురు, మరో మహిళను వేధించినందుకుగానూ ఒక సౌదీ యజమాని వారిని చిత్రహింసలకు గురిచేసి సజీవంగా పాతిపెట్టినట్లు ఈ దర్యాప్తులో తేలింది. దీంతో ఈ కేసులో మొత్తం 25 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా, వీరిలో ముగ్గురిని కోర్టు దోషులుగా తేల్చి మరణశిక్షను విధించింది. ఫలితంగా ఈ ముగ్గురికి ఖతీఫ్‌ పట్టణంలో బహిరంగంగా శిరచ్ఛేదం చేసి మరణశిక్ష అమలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments