Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ దెబ్బకు పాకిస్థాన్ కకావికలం... సైనిక స్థావరాలు ధ్వంసం!

ఠాగూర్
సోమవారం, 12 మే 2025 (08:59 IST)
ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ చేపట్టిన సైనిక చర్యకు పాకిస్థాన్ కకావికలమైపోయింది. భారత మిస్సైళ్ల దాడికి పాకిస్థాన్ ప్రధాన వైమానిక స్థావరాలు ధ్వంసం కావడంతో అపారనష్టం వాటిల్లింది. ముఖ్యంగా, రావల్పిండిలో పాక్ ఆర్మీ ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌కు భారీ నష్టం వాటిల్లింది. ఈ మేరకు పాకిస్థాన్ మిత్రదేశమైన చైనా తాజాగా విడుదల చేసిన శాటిలైట్ ఫోటోలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. 
 
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో సైనిక చర్యకు దిగిన విషయంతెల్సిందే. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లలో ఉన్న ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ సాయుధ బలగాలు దాడులు చేశాయి. అయితే, ఈ దాడులను జీర్ణించుకోలేని పాకిస్థాన్ ప్రతిదాడులకు దిగింది. దీంతో భారత్ మరింత రెచ్చిపోయి, పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లి ఆ దేశ సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది. ముఖ్యంగా నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌కు గణనీయమైన నష్టం వాటిల్లింది. 
 
రావల్పిండిలోని ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పాకిస్థాన్ సైన్యానికి అత్యంత కీలకమైన, వ్యూహాత్మక వైమానిక స్థావరంగా ఉంది. భారత్ తన సైనిక సామర్థాయన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకే పాక్‌‍లోని వైమానిక స్థావరంపై దాడి చేసిందని అంతర్జాతీయ యుద్ధ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ దాడిలో నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌లోని రన్‌వే ధ్వంసమైనట్టు నివేదికలు సూచిస్తున్నాయి. దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలను చైనా తాజాగా విడుదల చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments