Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ మెలిక... సార్క్ దేశాల విదేశాంగ మంత్రులు సమావేశం రద్దు

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (20:26 IST)
అమెరికాలోని న్యూయార్క్ నగరం వేదికగా జరగాల్సిన సార్క్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం రద్దయింది. ఈ భేటీ శనివారం జరగాల్సివుంది. తాలిబ్లన ఆధీనంలోని అఫ్గానిస్థాన్‌కు ఈ సమావేశంలో ప్రాతినిధ్యం కల్పించాలని పాక్‌ పట్టుబట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 
 
అయితే ఈ ప్రతిపాదనపై భారత్‌ సహా మరికొన్ని దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ సమావేశం రద్దయినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. ఐరాస సర్వసభ్య సమావేశాల్లో భాగంగా ఏటా ఈ సమావేశాలు జరుగుతాయి.
 
అమెరికాసేనల నిష్క్రమణతో ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్లు ప్రజా ప్రభుత్వాన్ని కూల్చివేసి, అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. భారత్ సహా చాలా దేశాలు ఆ ప్రభుత్వాన్ని ఇంకా గుర్తించలేదు. అలాగే కేబినెట్ మంత్రులుగా ఎంపికైన పలువురు తాలిబన్ నేతలు ఐరాస నిషేధిత జాబితాలో ఉన్నారు.
 
కాగా, సార్క్‌ అనేది దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సంఘం. భారత్‌, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక, మాల్దీవులు, భూటాన్‌ ఇందులో సభ్య దేశాలు. మొత్తం ప్రపంచ జనాభాలో దాదాపు 23 శాతం ఇక్కడే ఉంది. అయితే భారత్, పాక్‌ మధ్య ఉద్రిక్తతలు సార్క్‌ సమావేశాలపై ప్రభావం చూపుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఛాన్స్ వస్తే ముద్దు సీన్‌ - హగ్ సీన్లలో నటిస్తా : రీతూవర్మ

తమిళ హీరో అజిత్ కుమార్‌ తప్పిన ప్రాణముప్పు.. ఎందుకని? (Video)

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

తర్వాతి కథనం
Show comments