Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్యా విమానంపై పిడుగు పడటం వల్లే ప్రమాదం

Webdunia
సోమవారం, 6 మే 2019 (12:55 IST)
విమానయాన చరిత్రలో మరో విషాదం చోటుచేసుకుంది. రష్యాలో జరిగిన విమాన ప్రమాదంలో 41 మంది ప్రయాణీకులు మృత్యువాత పడ్డారు. విమానం టేకాఫ్ తీసుకునే సమయంలో పిడుగు పడటంతో విమానం వెనుక భాగంలో మంటలు అంటుకున్నాయి. అవి క్రమంగా విమానం ముందుభాగానికి వ్యాపించాయి. దీంతో తీవ్ర భయాందోళనకుగురైన ప్రయాణీకులు ముందుభాగంలో తెరుచుకున్న అత్యవసర ద్వారం గుండా బయటకు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. 
 
నిజానికి ఈ విమానం టేకాఫ్ అయ్యే సమయంలో ఏర్పడిన సాంకేతిక లోపంతో విమానం నేలకు బలంగా ఢీకొనడంతో మంటలు చెలరేగినట్టు వార్తలు వచ్చాయి. కానీ, విమానం ల్యాండ్‌ అవుతున్న సమయంలో వెనుకభాగంలో పిడుగుపడటంతో మంటలు వ్యాపించాయని నిపుణుల బృందం తేల్చింది. మరణించిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. 
 
ఈ ప్రమాదం రాజధాని మాస్కోలోని షెరెమెత్యేవో విమానాశ్రయంలో టేకాఫ్‌ తీసుకున్న సుఖోయి సూపర్‌జెట్ విమానంలో కాసేపటికే సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో విమానాన్ని వెనక్కి రప్పించారు. ఈ క్రమంలో విమానం ల్యాండ్‌ అవుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది. వెనుక భాగంలో మంటలు అంటుకున్నాయి. మంటలతోనే విమానం రన్‌‌వే‌పై పరుగులు పెట్టింది. ఇటు హుటాహుటిన విమానంలోని అత్యవసర ద్వారాలు తెరుచుకున్నాయి. ఎమర్జెన్సీ ద్వారంగుండా 37 మంది ప్రయాణీకులు బయటపడి తమ ప్రాణాలను కాపాడుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments