Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్యా నుంచి భారత్‌కు వైద్య సామాగ్రి.. 150 బెడ్‌సైడ్ మానిటర్లు..

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (11:27 IST)
భారత్‌లో కరోనా మహమ్మారి ఉధృతి అంతకంతకూ పెరిగిపోతున్నది. రోజూ లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశంలోని ఆస్పత్రులన్నీ కరోనా బాధితులతో నిండిపోతున్నాయి. 
 
రోగుల తాకిడి పెరుగుతుండటంతో ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌తోపాటు, ఇతర వైద్య సామాగ్రి కూడా నిండుకుంటుంది. ఈ నేపథ్యంలో పొరుగుదేశాలన్నీ భారత్‌కు సహాయ సహకారాలు అందించేందుకు ముందుకొస్తున్నాయి.
 
తాజాగా రష్యా కూడా భారత్‌కు భారీగా వైద్యసామాగ్రిని పంపింది. రష్యా నుంచి 20 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, 75 వెంటిలేటర్లు, 150 బెడ్‌సైడ్ మానిటర్లు, 22 మెట్రిక్ టన్నుల ఔషధాలతో బుధవారం బయలుదేరిన రెండు విమానాలు ఈ తెల్లవారుజామున ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నాయి.
 
విమానాల నుంచి వైద్య సామాగ్రిని అన్‌లోడ్ చేయించిన అధికారులు అవసరమున్న వివిధ ఆస్పత్రులకు దాన్ని చేరేవేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments