Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్యా నుంచి భారత్‌కు వైద్య సామాగ్రి.. 150 బెడ్‌సైడ్ మానిటర్లు..

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (11:27 IST)
భారత్‌లో కరోనా మహమ్మారి ఉధృతి అంతకంతకూ పెరిగిపోతున్నది. రోజూ లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశంలోని ఆస్పత్రులన్నీ కరోనా బాధితులతో నిండిపోతున్నాయి. 
 
రోగుల తాకిడి పెరుగుతుండటంతో ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌తోపాటు, ఇతర వైద్య సామాగ్రి కూడా నిండుకుంటుంది. ఈ నేపథ్యంలో పొరుగుదేశాలన్నీ భారత్‌కు సహాయ సహకారాలు అందించేందుకు ముందుకొస్తున్నాయి.
 
తాజాగా రష్యా కూడా భారత్‌కు భారీగా వైద్యసామాగ్రిని పంపింది. రష్యా నుంచి 20 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, 75 వెంటిలేటర్లు, 150 బెడ్‌సైడ్ మానిటర్లు, 22 మెట్రిక్ టన్నుల ఔషధాలతో బుధవారం బయలుదేరిన రెండు విమానాలు ఈ తెల్లవారుజామున ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నాయి.
 
విమానాల నుంచి వైద్య సామాగ్రిని అన్‌లోడ్ చేయించిన అధికారులు అవసరమున్న వివిధ ఆస్పత్రులకు దాన్ని చేరేవేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments