Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 287 కోట్ల లాటరీ, డబ్బు అందుకునేలోపుగా అతడిని వెంటాడిన మృత్యువు

ఐవీఆర్
బుధవారం, 18 డిశెంబరు 2024 (18:50 IST)
లాటరీలో అతడికి ఏకంగా 287 కోట్ల రూపాయలు వచ్చాయి. పైగా అతడు ఓ మామూలు రైతు. కూలి పనులు చేసుకునే రైతుని ఒక్కసారిగా ధనలక్ష్మి కరుణించడంతో కోట్ల రూపాయలకు అధిపతి అయ్యాడు. లాటరీ ద్వారా వచ్చిన డబ్బుతో ఖరీదైన ఇల్లు కొనుగోలు చేయాలనుకున్నాడు. ఇంకా తనకు వున్న కోరికలన్నీ తీర్చుకోవాలనుకున్నాడు. ఇంతలో అతడిని ఎన్నాళ్లుగానో వేధిస్తున్న పంటినొప్పి గుర్తుకు వచ్చింది. వెంటనే ఆసుపత్రికి వెళ్లి శస్త్రచికిత్స చేయించుకునేందుకు చేరిపోయాడు.
 
అక్కడ వైద్యులు అతడికి ఆపరేషన్ చేస్తుండగా అనూహ్యంగా మృతి చెందాడు. లాటరీలో తగిలిన డబ్బును అప్పజెప్పేందుకు పోలీసు బందోబస్తు అతడిని వెతుక్కుంటూ రాగా ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుసుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని అతడి గురించి వాకబు చేయగా శస్త్ర చికిత్స చేస్తున్న సమయంలో అతడికి గుండెపోటు వచ్చి మరణించినట్లు వైద్యులు తెలిపారు. కోట్ల రూపాయలు వచ్చినా వాటిని అనుభవించేలోపే అతడు మృత్యువాత పడటంతో అక్కడ విషాదం అలముకుంది. ఈ ఘటన బ్రెజిల్ దేశంలో జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments