Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాందహార్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై రాకెట్ల దాడి

Webdunia
ఆదివారం, 1 ఆగస్టు 2021 (13:53 IST)
అఫ్గానిస్థాన్‌లోని కాందహార్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై శనివారం రాత్రి తాలిబన్లు మూడు రాకెట్లు ప్రయోగించారని అధికారులు తెలిపారు. రెండు రాకెట్లు రన్‌వే తాకడంతో విమానాల రాకపోకలను రద్దు చేశామని చెప్పారు.

రన్‌వే మరమ్మతు పనులు జరుగుతున్నాయని, ఆదివారం సాయంత్రం నుండి సేవలను అందుబాటులోకి తెస్తామని ఎయిర్‌పోర్ట చీఫ్‌ మసూద్‌ పష్టున్‌ తెలిపారు. అమెరికా, నాటో బలగాల నిష్క్రమణ తర్వాత ఆఫ్గాన్‌లో తాలిబన్లు పలు ప్రాంతాలను తమ చేతులోకి తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే 80 శాతం భూభాగం వారు ఆక్రమించుకున్నారు. ఈ క్రమంలో అఫ్గాన్‌ సైన్యం, తాలిబన్ల మధ్య భీకర పోరు జరుగుతోంది. కాబుల్‌లోని సివిల్‌ ఏవియేషన్‌ అధికారి ఈ రాకెట్‌ దాడిని ధ్రువీకరించారు. కావాల్సిన లాజిస్టిక్‌, వాయుసేన సహకారం ఇక్కడి నుంచే కొనసాగుతోన్న నేపథ్యంలోనే తాలిబన్లు విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకొని దాడి చేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

మరో రెండు రాష్ట్రాల రాజధానులైన హెరాత్‌, లష్కర్‌ ఘాను సైతం సొంతం చేసుకునేందుకు తాలిబన్లు ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఈ నగరాల సరిహద్దులకు చేరారు.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments