రైల్వేలను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు : కేంద్రం

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (14:42 IST)
రైల్వేను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేసింది. రైల్వేను ప్రైవేటీకరణ చేయబోతున్నారంటూ విపక్ష సభ్యులు గురువారం పార్లమెంట్‌లో ఆందోళన చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. రైల్వేను ప్రైవేటీకరించనున్నట్టు సాగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, రైల్వేను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేసింది. 
 
బడ్జెట్‌లో రైల్వే శాఖ కేటాయింపులపై గురువారం చర్చ జరిగింది. దీనిపై అనేక మంది విపక్ష సభ్యులు మాట్లాడారు. రైల్వేల ప్రైవేటీకరణకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని ఆరోపిస్తూ సభలో ఆందోళన వ్యక్తం చేశారు. 
 
దీంతో రైల్వేశాఖామంత్రి అశ్విన్ వైష్ణవ్ వివరణ ఇచ్చారు. రైల్వేలను ప్రైవేటీకరణ చేసే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. రైల్వే వ్యవస్థలో రైళ్ళు, ట్రాక్‌లు, రైల్వేస్టేషన్లు, ఇంజిన్లు, బోగీలు అన్ని ప్రభుత్వ ఆస్తులేనని వివరించారు. రైల్వేను కేంద్రం ప్రైటీకరిస్తుందన్న ఆరోపణలు విపక్ష సభ్యుల ఊహాజనితమేనని అశ్విన్ వైష్ణవ్ స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments