Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిపబ్లిక్‌డే వేడుకలకు బ్రిటన్‌ ప్రధాని

Webdunia
బుధవారం, 16 డిశెంబరు 2020 (06:06 IST)
జనవరి 26న దేశరాజధాని ఢిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ హాజరు కానున్నారు. భారతదేశం నుండి వచ్చిన ఈ ఆహ్వానాన్ని జాన్సన్‌ గొప్ప గౌరవంగా భావించారని యుకె విదేశాంగశాఖ కార్యదర్శి డోమినిక్‌రాబ్‌ తెలిపారు.

భారత్‌ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ఢిల్లీకి చేరుకున్న రాబ్‌ను భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ స్వాగతం పలికారు. అనంతరం రాబ్‌ మాట్లాడుతూ.. గతేడాది బోరిస్‌ జాన్సన్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది ఆయన మొదటి దైపాక్షిక సందర్శనగా పేర్కొన్నారు.

కొత్త సంవత్సరంలో భారతదేశాన్ని సందర్శించడం పట్ల బోరిస్‌ జాన్సన్‌కు ఆనందంగా ఉందన్నారు. భారత ప్రధాని, తామూ కలిసి చేసిన ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా క్వాంటమ్‌ లీప్‌ను ఇచ్చేందుకు ఎదురుచూస్తున్నారని తెలిపారు.

అలాగే వచ్చే ఏడాది బ్రిటన్‌లో జరగనున్న జి7 సమ్మిట్‌కు మోడీని బోరిస్‌ ఆహ్వానించినట్లు రాబ్‌ తెలిపారు. దీనిపట్ల భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ సంతోషం వ్యక్తం చేశారు. రిపబ్లిక్‌డే దినోత్సవ వేడుకలకు బోరిస్‌ రాకతో భారత్‌-యుకెల మధ్య సంబంధాలు కొత్త శకానికి నాంది పలికినట్లవుతుందని తెలిపారు.

కాగా.. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి రిపబ్లిక్‌డే పరేడ్‌కు వచ్చిన బ్రిటీషర్లలో బోరిస్‌ రెండోవారు. 1993లో జాన్‌ మేజర్‌ హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments