Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్‌లో కుమారుడితో భారత సంతతి దంపతులు మృతి.. ఒకరినొకరు కత్తితో..?

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2020 (20:25 IST)
బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన దంపతులు తమ మూడేళ్ల కుమారుడితో పాటు విగతజీవులై కనిపించారు. బ్రిటన్‌లోని పశ్చిమ లండన్‌లో దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే.. బ్రెంట్‌ఫోర్డ్ ప్రాంతంలోని తమ నివాసంలో కుహ రాజ్ సీతంపరనాథన్ (42), ఆయన భార్య పూర్ణ కామేశ్వరి శివరాజ్ (36), వారి కుమారుడు కైలాశ్ కుహ రాజ్ (3)లు విగతజీవులుగా గుర్తించారు. తల్లీ కుమారుడిని గత నెల 21న చివరిసారి చూసినట్టు స్థానికులు తెలిపారు.
 
వారి ఆచూకీ తెలియకపోవడంతో బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో సోమవారం అర్ధ రాత్రి బలవంతంగా ఇంటి తలుపులు తెరిచి ఇంట్లోకి ప్రవేశించారు. 
 
లోపల కనిపించిన దృశ్యం చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. పూర్ణ కామేశ్వరి, ఆమె కుమారుడు కైలాశ్‌లు విగతజీవులుగా కనిపించారు. ఆమె భర్త కుహ రాజ్‌ కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడి ఉన్నాడని, ఆ వెంటనే అతడు మృతి చెందాడని పోలీసులు తెలిపారు. తాము ఇంట్లోకి ప్రవేశించడంతో పూర్ణ భర్త కుహ రాజ్ తనకు తానే పొడుచుకుని ఉంటాడని అనుమానిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments