Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్‌లో కుమారుడితో భారత సంతతి దంపతులు మృతి.. ఒకరినొకరు కత్తితో..?

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2020 (20:25 IST)
బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన దంపతులు తమ మూడేళ్ల కుమారుడితో పాటు విగతజీవులై కనిపించారు. బ్రిటన్‌లోని పశ్చిమ లండన్‌లో దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే.. బ్రెంట్‌ఫోర్డ్ ప్రాంతంలోని తమ నివాసంలో కుహ రాజ్ సీతంపరనాథన్ (42), ఆయన భార్య పూర్ణ కామేశ్వరి శివరాజ్ (36), వారి కుమారుడు కైలాశ్ కుహ రాజ్ (3)లు విగతజీవులుగా గుర్తించారు. తల్లీ కుమారుడిని గత నెల 21న చివరిసారి చూసినట్టు స్థానికులు తెలిపారు.
 
వారి ఆచూకీ తెలియకపోవడంతో బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో సోమవారం అర్ధ రాత్రి బలవంతంగా ఇంటి తలుపులు తెరిచి ఇంట్లోకి ప్రవేశించారు. 
 
లోపల కనిపించిన దృశ్యం చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. పూర్ణ కామేశ్వరి, ఆమె కుమారుడు కైలాశ్‌లు విగతజీవులుగా కనిపించారు. ఆమె భర్త కుహ రాజ్‌ కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడి ఉన్నాడని, ఆ వెంటనే అతడు మృతి చెందాడని పోలీసులు తెలిపారు. తాము ఇంట్లోకి ప్రవేశించడంతో పూర్ణ భర్త కుహ రాజ్ తనకు తానే పొడుచుకుని ఉంటాడని అనుమానిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments