Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్‌లో కుమారుడితో భారత సంతతి దంపతులు మృతి.. ఒకరినొకరు కత్తితో..?

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2020 (20:25 IST)
బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన దంపతులు తమ మూడేళ్ల కుమారుడితో పాటు విగతజీవులై కనిపించారు. బ్రిటన్‌లోని పశ్చిమ లండన్‌లో దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే.. బ్రెంట్‌ఫోర్డ్ ప్రాంతంలోని తమ నివాసంలో కుహ రాజ్ సీతంపరనాథన్ (42), ఆయన భార్య పూర్ణ కామేశ్వరి శివరాజ్ (36), వారి కుమారుడు కైలాశ్ కుహ రాజ్ (3)లు విగతజీవులుగా గుర్తించారు. తల్లీ కుమారుడిని గత నెల 21న చివరిసారి చూసినట్టు స్థానికులు తెలిపారు.
 
వారి ఆచూకీ తెలియకపోవడంతో బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో సోమవారం అర్ధ రాత్రి బలవంతంగా ఇంటి తలుపులు తెరిచి ఇంట్లోకి ప్రవేశించారు. 
 
లోపల కనిపించిన దృశ్యం చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. పూర్ణ కామేశ్వరి, ఆమె కుమారుడు కైలాశ్‌లు విగతజీవులుగా కనిపించారు. ఆమె భర్త కుహ రాజ్‌ కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడి ఉన్నాడని, ఆ వెంటనే అతడు మృతి చెందాడని పోలీసులు తెలిపారు. తాము ఇంట్లోకి ప్రవేశించడంతో పూర్ణ భర్త కుహ రాజ్ తనకు తానే పొడుచుకుని ఉంటాడని అనుమానిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouni Roy: విశ్వంభరలో పాట కోసం రూ.45 లక్షలు తీసుకున్న మౌని రాయ్

Mahavatar Narasimha: మహావతార్ నరసింహను పవన్ కళ్యాణ్ చూస్తారనుకుంటా.. అల్లు అరవింద్

Raashii Khanna : బాలీవుడ్ ప్రాజెక్టును కైవసం చేసుకున్న రాశిఖన్నా

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

జీవితంలో మానసిక ఒత్తిడిలు - ఎదురు దెబ్బలు - వైఫల్యాలు పరీక్షించాయి : అజిత్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments