Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో ఉన్మాది వీరంగం.. ఈశాన్య సియోటెల్‌లో కాల్పుల మోత

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (11:55 IST)
అగ్రరాజ్యం అమెరికాలో మరోమారు తుపాకీ కాల్పుల మోత మోగింది. ఓ ఉన్మాది ఒకడు తుపాకీతో వీరంగం సృష్టించాడు. వాహనదారులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పులు ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఈశాన్య సియోటెల్‌లో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈశాన్య సియాటెల్ ప్రాంతంలో ఉంటున్న ఓ దుండగుడు స్థానిక కాలమానం ప్రకారం బుధవారం తుపాకీతో హల్‌చల్ చేశాడు. తొలుత కారును నిలువరించి అందులోని మహిళను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ ఆమె ప్రతిఘటించడంతో కాల్పులు జరిపాడు. దీంతో ఆ మహిళ అక్కడే కుప్పకూలిపోయింది.
 
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకోవడంతో అటుగా వెళుతున్న బస్సుపై కాల్పులు జరిపి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. ఈ సందర్భంగా శరీరంలోకి బుల్లెట్లు దూసుకుపోయినప్పటికీ చాకచక్యంగా బస్సును ఆపకుండా ముందుకు తీసుకెళ్లిపోయాడు. డ్రైవర్‌తో పాటు గాయపడ్డ మహిళను అధికారులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. 
 
అక్కడతో ఆగని ఆ ఉన్మాది అటుగా వెళుతున్న కారుపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం కారును వేగంగా తీసుకెళ్లిన దుండగుడు.. ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టాడు. దీంతో అందులోని వ్యక్తి ప్రాణాలు వదిలాడు. చివరికి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. అయితే ఈ కాల్పులు ఎందుకు జరిపారన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు.

సంబంధిత వార్తలు

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments