Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చేనెల 21తో భూమి అంతమా?

వచ్చే నెల 21వ తేదీతో భూమి అంత కాబోతుందట. ఈ మాట చెపుతున్నది ఎవరో కాదు... పరిశోధనల్లో స్పెషలిస్ట్ అయిన డేవిడ్ మీడ్. అక్టోబర్ 21 నుంచి భూమికి ఇక నూకలు చెల్లినట్లేనని ఘంటాపథంగా చెపుతున్నాడు.

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2017 (06:40 IST)
వచ్చే నెల 21వ తేదీతో భూమి అంత కాబోతుందట. ఈ మాట చెపుతున్నది ఎవరో కాదు... పరిశోధనల్లో స్పెషలిస్ట్ అయిన డేవిడ్ మీడ్. అక్టోబర్ 21 నుంచి భూమికి ఇక నూకలు చెల్లినట్లేనని ఘంటాపథంగా చెపుతున్నాడు. 
 
నిజానికి ఈనెల 23వ తేదీనే ప్లానెట్ ఎక్స్ భూమిని ఢీకొట్టబోతుందనీ, చావడానికి అందరూ సిద్ధంగా ఉండండి అంటూ వార్నింగ్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఇపుడే ఆ తేదీ వెళ్లిపోగా, ఈసారి కొత్త డేట్‌తో మన ముందుకు వచ్చాడు. అక్టోబర్ 21 నుంచి భూమికి ఇక నూకలు చెల్లినట్లే అంటూ వాదిస్తున్నాడు. ఈసారి మాత్రం తన అంచనా తప్పదని అంటున్నాడు. 
 
ఆ డేట్ ఈ శతాబ్దంలో ఎంతో ముఖ్యమైనది అని తన వెబ్‌సైట్‌లో రాసుకున్నాడు. ఆ రోజు నుంచే భూమిపై విపత్తులు మొదలవుతాయని, ఏడేళ్ల పాటు ఇవి కొనసాగుతాయని మీడ్ జోస్యం చెపుతున్నాడు. 
 
నిబిరు అనే గ్రహం మనవైపు దూసుకొందని, అది ఈ ఏడాది మన భూమిని దాటగానే.. భూకంపాలు, అగ్నిపర్వతాల పేలుళ్లు, అలలు ఎగిసిపడటం, ఇతర విపత్తులు సంభవిస్తాయని చెబుతున్నాడు. నాసా మాత్రం అతని అంచనాలను ఖండిస్తూనే వస్తున్నది. అసలు నిబిరు అనే గ్రహమే లేదని స్పష్టంచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments