Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్ చిచ్చుకు ఆజ్యం పోసిన పాకిస్థాన్ మాజీ చీఫ్ ముషారఫ్

Webdunia
మంగళవారం, 8 అక్టోబరు 2019 (12:16 IST)
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కాశ్మీర్ చిచ్చుకు ఆజ్యం పోశారు. ఇప్పటికే భారత్-పాకిస్థాన్‌ల మధ్య కాశ్మీర్‌ల మధ్య ఇప్పటికే కాశ్మీర్ అంశం చిచ్చుపెట్టిన నేపథ్యంలో తిరిగి తాను క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు ముషారఫ్ చెప్పకనే చెప్పారు. ప్రస్తుతం దుబాయ్‌‌లో ఉన్న ఆయన.. కార్గిల్ యుధ్ధం గురించి ప్రస్తావించాడు. 
 
తమ దేశం సదా శాంతి మంత్రాన్ని జపిస్తున్నప్పటికీ.. భారత్ అదే పనిగా తమను బెదిరిస్తూ వస్తోందంటూ ఆరోపించాడు. ఆల్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఏపీఎంఎల్) చైర్మన్ అయిన 76 ఏళ్ళ ముషారఫ్… తమ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి దుబాయ్ నుంచి ఫోనులో మాట్లాడారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించేందుకు వీలు కల్పిస్తున్న ఆర్టికల్ 370 ని మోదీ ప్రభుత్వం రద్దు చేసిన అనంతరం ముషారఫ్ చేసిన తొలి కామెంట్ ఇదే. 
 
ఎట్టి పరిస్థితుల్లోనూ తాము కాశ్మీరీ సోదరులకు అండగా ఉంటామని ముషారఫ్ చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ శాంతిని కోరుతున్నదంటే దాన్ని బలహీనతగా భావించరాదని అన్నారు. 2016 మార్చి నుంచీ దుబాయ్ లోనే ఉంటున్న ముషారఫ్.. 2007 లో దుబాయ్ విమానం ఎక్కక తప్పలేదు. రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసినందుకు ఆయనపై అప్పటి ప్రభుత్వం రాజద్రోహం కేసు మోపింది. ప్రస్తుతం ముషారఫ్ ఆరోగ్యం మెరుగుపడుతోందని పాకిస్తానీ మీడియా తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments