Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pakistani Family in Visakhapatnam: విశాఖలో పాకిస్థానీ ఫ్యామిలీ.. అలా పర్మిషన్ ఇచ్చారు..

సెల్వి
బుధవారం, 30 ఏప్రియల్ 2025 (14:22 IST)
పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో, భారత కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 29 నాటికి దేశంలో నివసిస్తున్న పాకిస్తానీ పౌరులందరూ భారతదేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. గడువు ముగియడంతో, విశాఖపట్నంలో నివసిస్తున్న ఒక పాకిస్తానీ కుటుంబానికి బహిష్కరణ నుండి తాత్కాలిక ఉపశమనం లభించింది.
 
ఆ కుటుంబం సోమవారం విశాఖపట్నం నగర పోలీసు కమిషనర్ శంఖా బ్రాతా బాగ్చిని కలుసుకుని తమ పరిస్థితిని వివరించింది. తమ కుమారుడు తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడని, స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని వారు ఆయనకు తెలియజేసారు. అతని చికిత్స పూర్తయ్యే వరకు నగరంలో ఉండటానికి అనుమతి కోరారు. 
 
దీర్ఘకాలిక వీసా కోసం తాము ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నామని, అయితే దరఖాస్తు ఇంకా పెండింగ్‌లో ఉందని కుటుంబం తెలిపింది. విశేషమేమిటంటే, కుటుంబంలో భర్త, పెద్ద కుమారుడు పాకిస్తానీ పౌరులు అయితే, భార్య  చిన్న కుమారుడు భారత పౌరసత్వం కలిగి ఉన్నారు.
 
ఆ కుటుంబం పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న పోలీస్ కమిషనర్ శంఖా బ్రాతా బాగ్చి వెంటనే స్పందించి, ఈ విషయాన్ని సీనియర్ ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్‌లోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO)తో ఈ విషయంపై చర్చించింది.
 
ఈ సంప్రదింపుల తర్వాత, అధికారులు ఆ కుటుంబం విశాఖపట్నంలోనే మరికొంత కాలం ఉండటానికి అనుమతి ఇచ్చారు. ఈ పరిణామంపై వ్యాఖ్యానిస్తూ, పోలీస్ కమిషనర్ శంఖా బ్రతా బాగ్చి, "మానవతా దృక్పథంతో, తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు ఆ కుటుంబం విశాఖపట్నంలోనే ఉండటానికి అనుమతించబడింది" అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments