Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవన్నీ అవాస్తవాలు, మేం పాకిస్తాన్‌కు ఆయుధాలు పంపలేదు: టర్కీ

ఐవీఆర్
బుధవారం, 30 ఏప్రియల్ 2025 (14:05 IST)
పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారతదేశం- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపధ్యంలో టర్కీ పాకిస్తాన్‌కు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేస్తోందని పేర్కొంటూ వార్తలు వచ్చాయి. సైనిక సామగ్రిని అందించడానికి టర్కిష్ C-130E హెర్క్యులస్ కరాచీలో దిగిందని ఆ నివేదికలు తెలిపాయి. ఈ వార్త కాస్తా వైరల్ అయ్యింది. అంతేకాదు... సుమారు ఆరు C-130E విమానాలు పాకిస్తాన్‌లో దిగాయని కూడా పేర్కొన్నాయి.
 
అయితే ఈ వార్తలను టర్కీ తోసిపుచ్చింది. అవన్నీ ఉత్తమాటలేననీ, తమ దేశం టర్కీ నుండి ఒక కార్గో విమానం ఇంధనం నింపేందుకు మాత్రమే పాకిస్తాన్‌లో దిగిందని ప్రెసిడెన్సీ డైరెక్టరేట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ చెప్పిందని ఓ వార్తా సంస్థ వెల్లడించింది. ‘టర్కియే పాకిస్తాన్‌కు ఆయుధాలతో నిండిన ఆరు విమానాలను పంపుతున్నట్లు’ కొన్ని మీడియా సంస్థలలో వ్యాపించే వాదనలు నిజం కాదని టర్కిష్ అధికారులు సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌లో తెలిపారు.
 
కాగా 2023లో టర్కీలో భారీ భూకంపం సంభవించింది. ఆ సమయంలో భారతదేసం టర్కీకి ఆపన్నహస్తం అందించింది. సాయం అందించిన చేతులకు హాని ఎలా తలపెడతాము అంటూ పేరు చెప్పేందుకు నిరాకరించిన ఓ టర్కీ అధికారి వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments