Webdunia - Bharat's app for daily news and videos

Install App

చివరి రక్తబొట్టు వరకు కాశ్మీర్ కోసం పోరాడుతాం : పాకిస్థాన్

Webdunia
శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (13:20 IST)
తమ అజెండాలో ఉన్న అంశాల్లో కాశ్మీర్ అజెండా ఒకటనీ, దానికోసం తమ ప్రతి ఒక్క సైనికుడు చివరి రక్తపుబొట్టు వరకు పోరాడుతామని పాకిస్థాన్ ప్రకటించింది. ఇదే అంశంపై పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ కమర్‌ జావేద్‌ బజ్వా స్పందిస్తూ, కాశ్మీర్‌ పాకిస్థాన్ ముఖ్య ఎజెండాలో ఒకటి. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మేము ఓ సవాలుగా భావిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ కాశ్మీర్‌‌ను వదిలుకునే ప్రసక్తే లేదు. మా సైనికుడు తన చివరి రక్తపు బొట్టు, చివరి బుల్లెట్‌ అయిపోయే వరకూ, తుది శ్వాస ఆగే వరకూ పోరాడుతూనే ఉంటాడు అని ఘాటుగా స్పందించారు.
 
అంతేకాకుండా, కాశ్మీర్ ప్రజల కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధమేనని, లోయలో బలవంతంగా హిందుత్వాన్ని రుద్దేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. కాశ్మీర్ ప్రజల కోసం యుద్ధం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. 
 
మరోవైపు, జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ వచ్చిన 370 అధికరణను రద్దు చేసి నెల రోజులుదాటిపోయినప్పటికీ.. పాకిస్థాన్ మాత్రం తన బీరాలు, ప్రగల్భాలు మాత్రం మానుకోవడం లేదు. నియంత్రణ రేఖ వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడుతూ, సరిహద్దులకు భారీ సంఖ్యల బలగాలను తరలిస్తోంది. పైగా, భారత్‌లో అల్లర్లు, విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ ఉగ్రవాదులను సరిహద్దులు దాటిస్తోంది. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments