Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

ఠాగూర్
బుధవారం, 14 మే 2025 (21:55 IST)
సింధూ జలాల ఒప్పందం రద్దుపై పాకిస్థాన్ కాళ్లబేరానికి వచ్చింది. ఈ విషయంలో తన వైఖరిని పునఃసమీక్షించుకోవాలని భారత్‌కు విజ్ఞప్తి చేసింది. సింధూ జలాల ఒప్పందం నిలిపివేత వల్ల జరిగే నష్టం ఏంటో పాకిస్థాన్‌కు తెలుసొచ్చింది. మొన్నటివరకు ఈ అంశంలో తీవ్ర స్వరంతో మాట్లాడిన దాయాది ఇపుడు ఆత్మరక్షణలో పడినట్టు తెలుస్తోంది. కాల్పుల విరమణకు అంగీకరించిన భారత్.. సింధూ జలాల విషయంలో వెనక్కి తగ్గేదే లే అని ప్రకటించడంతో ఇపుడు కాళ్ళ బేరానికి వచ్చింది. నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలంటూ కోరింది. ఈ మేరకు భారత ప్రభుత్వానికి లేఖ రాసింది. 
 
సింధూ జలాలు నిలిపివేస్తే పాక్‌లో తీవ్ర దుర్బిక్షం నెలకొంటుందంటూ భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు పాక్ జలవనరుల శాఖ లేఖ రాసినట్టు సమాచారం. ఈ విషయంపై చర్చించేందుకు పాక్ సిద్ధంగా ఉందని పేర్కొంది. ప్రోటోకాల్‌లో భాగంగా ఈ అంశాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపినట్టు తెలుస్తోంది. అయితే, రక్తం, నీరు, రెండూ కలిసి ప్రవహించలేదంటూ ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ప్రధాని మోడీ ఇప్పటికే స్పష్టం చేశారు. పాక్‌తో చర్చలంటూ జరిగితే ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పైనే అని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments