Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊపిరితో ఉన్న 15 రోజుల నవజాత శిశువును పాతిపెట్టిన కసాయి తండ్రి.. ఎక్కడ?

వరుణ్
సోమవారం, 8 జులై 2024 (11:04 IST)
పాకిస్థాన్ దేశంలోని సింధ్ ప్రావిన్స్‌లో హృదయివిదాకర ఘటన ఒకటి జరిగింది. ప్రాణాలతో ఉన్న 15 రోజుల నవజాత శిశువు (పాప)ను కసాయి తండ్రి ఒకడు సజీవంగా పాతిపెట్టాడు. బిడ్డ ఆస్పత్రి ఖర్చులు భరించలేక ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. గోనె సంచిలో బిడ్డను ఉంచి ఆపై పాతిపెట్టినట్టు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఓ దంపతులకు 15 రోజుల క్రితం బిడ్డ జన్మించాడు. పుట్టుకతోనే అనారోగ్యంతో జన్మించడంతో ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ ఆస్పత్రి ఖర్చులు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో వాటిని భరించలేని కన్నతండ్రి తయ్యబ్... చిన్నారిని ఓ గోనె సంచిలో పెట్టి పాతిపెట్టాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయాన్ని వెల్లడించారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు చిన్నారి మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
ఇష్టపూర్వకంగా సహజీవనం చేసి.. పెళ్లికి నో చెప్పాడని అత్యాచారం కేసు పెట్టడమా? హైకోర్టు ప్రశ్న
 
స్వేచ్ఛగా దశాబ్దకాలం పాటు సహజీవనం చేసి, జీవించిన తర్వాత పెళ్ళికి నిరాకరించాడన్న ఏకైక కారణంతో పురుషుడిపై ఓ మహిళ అత్యాచారం కేసు పెట్టడాన్ని మధ్యప్రదేశ్ హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. పైగా, ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. పదేళ్లకు పైగా స్వేచ్ఛగా శారీరక సంబంధాన్ని కొనసాగించారని, పిటిషనర్‌పై (పురుషుడు) అత్యాచారం కేసు నమోదు చేయడం సమర్థనీయం కాదని కోర్టు తేల్చిచెప్పింది. ఈ కేసు చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నట్టుగా ఉందని జస్టిస్ సంజయ్ ద్వివేది వ్యాఖ్యానించారు. ఈ మేరకు పిటిషనర్‌‍పై కేసు కొట్టివేయాలంటూ జులై 2న కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
 
ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే, 'ప్రతివాది (మహిళ) ఫిర్యాదు, ఐపీసీలోని సీఆర్పీసీ 164 కింద ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఐపీసీ సెక్షన్ 375 కింద దీనిని రేప్ కేసుగా పరిగణించలేము అనేది నా అభిప్రాయం. ఈ కేసు విచారణ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టు కనిపిస్తోంది' అని జస్టిస్ సంజయ్ ద్వివేది వ్యాఖ్యానించారు.
 
స్త్రీ, పురుషుడు ఇద్దరూ బాగా చదువుకున్న వ్యక్తులు అని, ఏకాభిప్రాయంతో ఇద్దరూ 10 ఏళ్లకుపైగా శారీరక సంబంధాన్ని కొనసాగించారని తేలిందని కోర్టు వెల్లడించింది. ఆ వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకోబోనని నిరాకరించడంతో ఇద్దరి మధ్య బంధం తెగిపోయిందని, పురుషుడిపై అత్యాచారం కేసు నమోదు చేయడం సబబు కాదని కోర్టు వ్యాఖ్యానించింది. 
 
స్త్రీని బలవంతంగానైనా పెళ్లి చేసుకోవాల్సిందేనంటూ కూడా పురుషుడిపై కేసు పెట్టలేమని (ఐపీసీ సెక్షన్ 366) కోర్టు స్పష్టం చేసింది. కాబట్టి పురుషుడిపై ఆ తర్వాతి కాలంలో ఐపీసీ సెక్షన్ 366 కింద పెట్టిన కేసును కూడా రద్దు చేస్తున్నట్టు కోర్టు పేర్కొంది.
 
కాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కట్నీ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో నవంబర్ 2021లో ఈ కేసు నమోదైంది. అత్యాచారం, ఇతర అభియోగాల కింద వ్యక్తిపై ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. అయితే తనపై కేసులు అక్రమమని, తనకు ఉపశమనం కల్పించాలంటూ పురుషుడు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు పై విధంగా తీర్పునిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments