కుక్క తోక వంకర.. మళ్లీ కాల్పులకు తెగబడిన పాకిస్థాన్ సైన్యం.. గ్రామాలు ఖాళీ..
కుక్క తోక వంకర అన్న చందంగా పాకిస్థాన్ వ్యవహరిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి పదే పదే తూట్లు పొడుస్తోంది. తాజాగా జమ్మూ కాశ్మీర్లోని భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లో కాల్పులు జరిపింది. హిరాన
కుక్క తోక వంకర అన్న చందంగా పాకిస్థాన్ వ్యవహరిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి పదే పదే తూట్లు పొడుస్తోంది. తాజాగా జమ్మూ కాశ్మీర్లోని భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లో కాల్పులు జరిపింది. హిరానగర్, కెరి, మెందార్, పూంచ్ సెక్టార్ల వద్ద పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది.
నానాటికి కాల్పుల తీవ్రత పెరిగిపోవడంతో సరిహద్దు గ్రామాలకు చెందిన ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇంకా సరిహద్దు ప్రాంతాల్లో ఇక నివాసం తగదని.. ఇళ్లు ఖాళీ చేసి, బంకర్లు, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. అయితే పాక్ రేంజర్ల దాడులను భారత జవాన్లు ధీటుగా ఎదుర్కొంటున్నారు. కాగా, పాక్ రేంజర్లు కాల్పుల విరమణ ఒప్పందానికి 50 సార్లు తూట్లు పొడిచి, కాల్పులకు తెగబడిందని సైనికాధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) నుంచి జమ్ముకశ్మీర్లోని తంగ్ధర్ సెక్టార్లోకి చొరబడడానికి పయత్నించిన ఉగ్రవాదులకు భారత జవాన్లు చుక్కలు చూపించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక జవాను ప్రాణాలు కోల్పోగా.. మరో జవానుకు తీవ్రగాయాలయ్యాయి.