Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్ ప్రావిన్స్‌లో ఎమర్జెన్సీ.. ఎందుకో తెలుసా?

Webdunia
మంగళవారం, 21 జూన్ 2022 (13:17 IST)
ఇటీవలికాలంలో ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోతోంది. వారిపై జరిగే అత్యాచారాలు, నేరాలు ఘోరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ విషయంలో ఏ ఒక్క దేశం మినహాయింపులేకుండా పోయింది. అయితే, పాకిస్థాన్ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్‌‍లో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోవడంతో వీటి అడ్డుకట్ట కోసం ఏకంగా ఎమర్జెన్సీని విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
మహిళపై జరుగుతున్న అత్యాచారాలను కట్టిడి చేసేందుకే ఈ అత్యవసర పరిస్థితిని విధించాల్సి వచ్చిందని ఆ ప్రావిన్స్ హోం మంతరి అత్తా తరార్ వెల్లడించారంటే అక్కడ పరిస్థితిని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 
 
దీనిపై ఆయన మాట్లాడుతూ, 'ప్రతి రోజూ కనీసం నాలుగైదు అత్యాచార కేసులు వెలుగు చూస్తున్నాయి. లైంగిక వేధింపులు, అఘాయిత్యాలు, బలవంతపు చర్యలు గురించి ఇక చెప్పనక్కర్లేదు. అందుకే ఎమర్జెన్సీని విధించినట్టు తెలిపారు. పైగా, లైంగిక వేధింపులు, బలవంతపు చర్యలను నిరోధించడానికి ప్రత్యేక చర్యలను ప్రభుత్వం పరిశీలిస్తుంది' అని వివరించారు. 
 
అత్యాచారాలు, శాంతిభద్రతల పరిస్థితులను రాష్ట్ర కేబినెట్ కమిటీ సమీక్షిస్తుందని చెప్పారు. ఈ ఘటనలను నియంత్రించేందుకు టీచర్లు, అటార్నీలు, మహిళా హక్కుల సంస్థలతో మాట్లాడుతున్నట్టు తెలిపారు. 
 
భద్రత గురించి తమ పిల్లలకు తెలియజెప్పాలని మంత్రి తరార్ సూచించారు. యువతులను ఇంట్లో ఒంటరిగా విడిచి వెళ్లొద్దని సూచించారు. అత్యాచార వ్యతిరేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించామని, స్కూళ్లలో అత్యాచార వేధింపులపై విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తామని అన్నారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం