Webdunia - Bharat's app for daily news and videos

Install App

అట్టారీ - వాఘా సరిహద్దులు మళ్లీ తెరుచుకున్నాయ్...

ఠాగూర్
శుక్రవారం, 2 మే 2025 (14:52 IST)
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో తమతమ దేశాల్లో ఉన్న భారత్, పాక్ పౌరులు తక్షణం స్వదేశాలకు వెళ్లిపోవాలంటూ ఇరు దేశాలు ఆదేశాలు జారీచేస్తూ గడువు విధించాయి. ఈ గడువు ముగియగానే ఇరు దేశాలు తమతమ దేశాల్లోని సరిహద్దులను మూసివేశాయి. ఈ నేపథ్యంలో అట్టారీ - వాఘా సరిహద్దును పాకిస్థాన్ తిరిగి తెరిచింది. 
 
భారత్ నుంచి వస్తున్న తమ పౌరులు స్వదేశంలోకి వచ్చేందుకు వీలు కల్పిస్తూ వాఘా సరిహద్దు వద్ద గేట్లను శుక్రవారం ఉదయం ఓపెన్ చేసింది. దీంతో బోర్డరులో చిక్కుకునిపోయిన చాలా మంది పాక్ జాతీయులు శుక్రవారం ఉదయం తమ దేశంలోకి అడుగుపెట్టారు. గురువారం నాడు సరిహద్దును మూసివేయడంతో అనేక మంది పాకిస్థానీయులు భారతదేశం వైపు చిక్కుకునిపోయారు. 
 
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో వివిధ విసాలపై ఉన్న పౌరులు తమ దేశాలకు వెళ్లిపోవాలంటూ ఇరు దేశాలు ఆదేశాలు జారీచేసిన విషయం తెల్సిందే. దానికి డెడ్‌లైన్ కూడా విధించాయి. ఆ గడువు ముగియడంతో పాకిస్థాన్ గురువారం ఉదయం 8 గంటలకు సరిహద్దులను మూసివేసింది. 
 
కాగా, బుధవారం 125 మంది పాకిస్థానీయులు అట్టారీ - వాఘా సరిహద్దు వద్ద భారత్‌ను విడిచి పాక్ భూభాగంలో అడుగుపెట్టారు. దీంతో ఆంక్షలు విధించి ఏప్రిల్ 24వ తర్వాత నుంచి ఏడు రోజులలో భారత్‌ను వీడిన పాక్ పౌరుల సంఖ్య 911కి చేరుకుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha: కాలేజీలో మహేష్ బాబుతో హాయ్-బై అనుకునేవాళ్లం.. కలిసి నటిస్తామని అనుకోలేదు.. త్రిష

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments