Webdunia - Bharat's app for daily news and videos

Install App

అట్టారీ - వాఘా సరిహద్దులు మళ్లీ తెరుచుకున్నాయ్...

ఠాగూర్
శుక్రవారం, 2 మే 2025 (14:52 IST)
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో తమతమ దేశాల్లో ఉన్న భారత్, పాక్ పౌరులు తక్షణం స్వదేశాలకు వెళ్లిపోవాలంటూ ఇరు దేశాలు ఆదేశాలు జారీచేస్తూ గడువు విధించాయి. ఈ గడువు ముగియగానే ఇరు దేశాలు తమతమ దేశాల్లోని సరిహద్దులను మూసివేశాయి. ఈ నేపథ్యంలో అట్టారీ - వాఘా సరిహద్దును పాకిస్థాన్ తిరిగి తెరిచింది. 
 
భారత్ నుంచి వస్తున్న తమ పౌరులు స్వదేశంలోకి వచ్చేందుకు వీలు కల్పిస్తూ వాఘా సరిహద్దు వద్ద గేట్లను శుక్రవారం ఉదయం ఓపెన్ చేసింది. దీంతో బోర్డరులో చిక్కుకునిపోయిన చాలా మంది పాక్ జాతీయులు శుక్రవారం ఉదయం తమ దేశంలోకి అడుగుపెట్టారు. గురువారం నాడు సరిహద్దును మూసివేయడంతో అనేక మంది పాకిస్థానీయులు భారతదేశం వైపు చిక్కుకునిపోయారు. 
 
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో వివిధ విసాలపై ఉన్న పౌరులు తమ దేశాలకు వెళ్లిపోవాలంటూ ఇరు దేశాలు ఆదేశాలు జారీచేసిన విషయం తెల్సిందే. దానికి డెడ్‌లైన్ కూడా విధించాయి. ఆ గడువు ముగియడంతో పాకిస్థాన్ గురువారం ఉదయం 8 గంటలకు సరిహద్దులను మూసివేసింది. 
 
కాగా, బుధవారం 125 మంది పాకిస్థానీయులు అట్టారీ - వాఘా సరిహద్దు వద్ద భారత్‌ను విడిచి పాక్ భూభాగంలో అడుగుపెట్టారు. దీంతో ఆంక్షలు విధించి ఏప్రిల్ 24వ తర్వాత నుంచి ఏడు రోజులలో భారత్‌ను వీడిన పాక్ పౌరుల సంఖ్య 911కి చేరుకుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాలీవుడ్ స్థాయిలో రాణిస్తున్న భారత డిజైనర్లు...

మంచు విష్ణుకు శ్రీవిష్ణు క్షమాపణలు ఎందుకంటే...

'కింగ్‌డమ్' నుంచి వైల్డ్ పోస్టర్‌ను రిలీజ్ చేసి మేకర్స్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments