Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని నరేంద్ర మోడీకి దారిచ్చే ప్రసక్తే లేదు : తేల్చేసిన పాకిస్థాన్

Webdunia
గురువారం, 19 సెప్టెంబరు 2019 (06:32 IST)
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్వరలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఇందుకోసం ఆయన విమానం పాకిస్థాన్ గగనతలం మీదుగా వెళ్లాల్సివుంది. అయితే, మోడీ ప్రయాణించే విమానానికి తమ గగనతలంపై దారిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. 
 
నరేంద్ర మోడీ అమెరికా పర్యటన కోసం పాకిస్థాన్ గగనతలాన్ని వినియోగించుకునేందుకు అనుమతించాలంటూ భారత్ విజ్ఞప్తి చేసింది. దీనిపై పాక్ స్పందించింది. తమ దేశ గగనతలాన్ని వినియోగించుకునేందుకు వీలులేదని తేల్చి చెప్పింది. 
 
ఈ సమాచారాన్ని భారత హై కమిషన్‌కు చేరవేసింది. ఈ విషయాన్ని పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషీ వెల్లడించారు. దీంతో మోడీ విమానం ఇతర దేశాల గగనతలం మీదుగా అమెరికాకు వెళ్లనుంది.
 
కాగా, జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెల్సిందే. ఈ చర్యను పాకిస్థాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
అంతకుముందు పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళాలు బాలాకోట్ ఉగ్రస్థావరాలపై దాడికి దిగడంతో తన గగనతలాన్ని మూసేసిన పాక్.. తాజాగా భారత్ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments