Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా టీకా వేసుకున్న పాకిస్థాన్ అధ్యక్షుడికి కరోనా పాజిటివ్

Webdunia
సోమవారం, 29 మార్చి 2021 (20:36 IST)
కరోనా వైరస్ ఏ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. సాధారణ ప్రజల నుంచి వీవీఐపీ వరకు ఈ వైరస్ సోకుతోంది. ఇటీవలే పాకిస్థాన్ ప్రధానమంత్రి ఈ వైరస్ బారినపడ్డారు. ఇపుడు ఆ దేశ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ కూడా మహమ్మారి బాధితుల జాబితాలో చేరారు. 
 
ఆరిఫ్ అల్వీకి కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని వెల్లడైంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తాను ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నానని, కానీ శరీరంలో యాంటీబాడీలు వృద్ధి చెందాలంటే రెండో డోసు తప్పనిసరి అని వివరించారు. 
 
మరో వారంలో రెండో డోసు తీసుకోవాల్సి ఉందని, ఈలోపే కరోనా సోకిందని ఆరిఫ్ అల్వీ విచారం వ్యక్తం చేశారు. అయితే, ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
 
ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా చైనా తయారీ కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న తర్వాత కరోనా బారినపడ్డారు. కరోనా సోకినప్పటికీ తన మీడియా బృందంతో సమావేశం నిర్వహించి విమర్శలపాలయ్యారు.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments