బాబ్బాబు.. మీతో చర్చలు జరుపుతాం : భారత్‌తో కాళ్ళబేరానికి పాకిస్థాన్

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (16:25 IST)
పాకిస్థాన్ కాళ్ళబేరానికి వచ్చింది. అన్ని సమస్యలపై భారత్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానిస్తున్నట్టు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ మీడియా ద్వారా ప్రకటించారు. దీనికంతటికీ కారణం.. అంతర్జాతీయంగా పాకిస్థాన్ కావడమే. భారత్ దౌత్యనీతితో పాక్‌ను అంతర్జాతీయంగా ఏకాని చేస్తోంది. చివరకు తమకు అండగా నిలబడుతుందని నమ్మిన చైనా కూడా చివరకు పాకిస్థాన్‌కు హ్యాండిచ్చింది. దీంతో పాకిస్థాన్ కాళ్ళబేరానికి వచ్చి చర్చల ప్రతిపాదనను తెలపైకి తెచ్చింది. 
 
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పీవోకేలోని జైష్ ఉగ్రతండాలపై వైమానిక దళంతో మెరుపుదాడులు చేయించింది. దీంతో పాకిస్థాన్ రెచ్చిపోయి భారత్‌పై దాడికి యత్నించింది. ఈ దాడులను భారత సైనికులు సమర్థంగా తిప్పికొట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. 
 
అదేసమయంలో అంతర్జాతీయ సమాజం కూడా పాకిస్థాన్‌పై తీవ్రమైన ఒత్తిడి చేస్తోంది. దీంతో పాకిస్థాన్ దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. రెండు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు సద్దుమణగడానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫోన్‌‌లో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాడని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి షా మెహమ్మద్ ఖురేషి ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments