Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ అసెంబ్లీ స్పీకర్‌కు పాజిటివ్.. ప్రధాని ఇమ్రాన్‌కు పరీక్షలు

Webdunia
శుక్రవారం, 1 మే 2020 (11:15 IST)
కరోనా బాధిత దేశాల్లో పాకిస్థాన్ ఒకటి. ఈ దేశంలో కూడా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇపుడు ఆ దేశ అసెంబ్లీ స్పీకర్ అసద్ ఖైసర్‌కి కూడా కరోనా వైరస్ సోకినట్టు తేలింది. అలాగే, ఈయన కుమారుడు, కుమార్తెకు కూడా ఈ వైరస్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు, ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. 
 
పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్‌గా ఖైసర్‌ కొనసాగుతున్నారు. ఈయన కరోనా లక్షణాలతో బాధపడుతుంటే గురువారం పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో కరోనా‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో ఖురేషీతోపాటు ఆయన కుటుంబసభ్యులను అధికారులు క్వారెంటైన్‌కు తరలించారు. 
 
అయితే, స్పీక‌ర్ ఖురేషి రెండు రోజుల క్రితం ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌తో స‌మావేశం కావ‌డం ఇప్పుడు ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. దీంతో ముందు జాగ్రత్తగా ప్రధానికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు స్పీకర్ ఖురేషి‌ ఎవరెవరిని కలిశారో గుర్తించి అంద‌రినీ క్వారెంటైన్‌కు త‌ర‌లిస్తున్నారు. 
 
మరోవైపు, పాకిస్థాన్‌లో ప్రస్తుతం మొత్తం 16819 నిర్ధారణ కేసులు ఉన్నాయి. అలాగే, 385 మంది ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోగా 4315 మంది చికిత్స పొంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 3.26 మిలియన్ కేసుల నమోదుకాగా, 233 వేల మంది మృత్యువాతపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments