Webdunia - Bharat's app for daily news and videos

Install App

బలాత్కారానికి పాల్పడితే నపుంసకుడిగా మార్చేస్తారు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 25 నవంబరు 2020 (08:43 IST)
ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న నేరాలు, ఘోరాలు, అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేరాలను అరికట్టేందుకు ఆయా దేశాలు ఎన్నో కఠిన చట్టాలు తీసుకొస్తున్నప్పటికీ.. పెద్ద ప్రయోజనం కనిపించడం లేదు. ముఖ్యంగా, ఇస్లామిక్ దేశాల్లో ఈ చట్టాలు మరింత కఠినంగా అమలవుతున్నప్పటికీ.. అక్కడ కూడా ఇవి ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. 
 
ఈ క్రమంలో పాకిస్థాన్ దేశం సరికొత్త చట్టానికి రూపకల్పన చేస్తోంది. ఇకపై అత్యాచారానికి పాల్పడిన వారిని రసాయనాల సాయంతో నపుంసకులుగా మార్చేస్తారు. ఈ కఠిన చట్టానికి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్టు సమాచారం. 
 
ఈ అత్యాచార నిరోధక ఆర్డినెన్స్ ముసాయిదాను దేశ న్యాయ మంత్రిత్వ శాఖ ఫెడరల్ కేబినెట్ ముందుకు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నూతన చట్టం అంశాన్ని పాక్‌లోని ఓ మీడియా సంస్థ వెల్లడించింది. దేశంలో అత్యాచారాల కట్టడికి ఈ కఠిన చట్టం దోహదపడుతుందని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments