Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల వేట ప్రారంభం... రంగంలోకి దిగిన ఆర్మీ

పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల వేట ప్రారంభమైంది. తీవ్రవాదుల కోసం ఆ దేశానికి చెందిన సైనికులు ముమ్మర వేట కొనసాగిస్తున్నారు. పాకిస్థాన్‌లో ఉన్నట్టుండి ఈ తరహా వైఖరి రావడం వెనుక అమెరికా ఒత్తిడో.. స్వదేశంలో ఉగ్రవా

Webdunia
ఆదివారం, 26 ఫిబ్రవరి 2017 (17:13 IST)
పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల వేట ప్రారంభమైంది. తీవ్రవాదుల కోసం ఆ దేశానికి చెందిన సైనికులు ముమ్మర వేట కొనసాగిస్తున్నారు. పాకిస్థాన్‌లో ఉన్నట్టుండి ఈ తరహా వైఖరి రావడం వెనుక అమెరికా ఒత్తిడో.. స్వదేశంలో ఉగ్రవాదులు సృష్టిస్తున్న మారణహోమం ఫలితమో తెలియదు. మొత్తంమీద తమ గడ్డపై ఉన్న ఉగ్రవాదుల ఏరివేతకు మాత్రం పాకిస్థాన్ నడుంబిగించింది. 
 
పంజాబ్ పోలీసులు, రేంజర్లు కలిసి రావల్పిండి, లయహ్ ప్రాంతాల్లో నిర్వహించిన విస్తృత దాడుల్లో 600 మందికిపైగా అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. 200 తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి మరీ ఉగ్రవాదుల భరతం పట్టారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో పాక్ రేంజర్లకు అనుమానిత ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. 
 
ఇటీవల పాక్‌ సింధు ప్రాంతంలోని సూఫీ ప్రార్థనా మందిరంపై జరిగిన ఉగ్రదాడిలో 80కి మందికిపైగా ప్రాణాలు కోల్పోగా 250మందికి పైగా గాయపడ్డారు. దీంతో అప్పటికప్పుడే ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఆర్మీ 40 మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టిన విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments