Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ విమానాన్ని సీజ్ చేసిన మలేషియా అధికారులు.. ఎందుకని?

Webdunia
బుధవారం, 31 మే 2023 (13:40 IST)
పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకునివున్న పాకిస్థాన్‌కు మలేషియా ప్రభుత్వ అధికారులు తేరుకోలేని షాకిచ్చారు. పాకిస్థాన్ విమానయాన సంస్థ పీఐఏకు చెందిన బోయింగ్ 777 రకం విమానాన్ని సీజ్ చేశారు. ఈ విమానాన్ని లీజుపై మలేసియా నుంచి పీఐఏ తీసుకొంది. కానీ, లీజు బకాయి 4 మిలియన్‌ డాలర్లకు చేరడంతో మంగళవారం ఈ విమానాన్ని కోర్టు ఆదేశాల మేరకు కౌలాలంపూర్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీజ్‌ చేశారు. 
 
వాస్తవానికి లీజ్‌ విషయంలో వివాదం కూడా ఉంది. ఈ విమానం తనదేనని ఎయిర్‌ క్రాఫ్ట్‌ లీజింగ్‌ కంపెనీ వాదిస్తుండగా.. పీఐఏ మాత్రం విమానం ఇంజిన్లలో ఒకటి మాత్రమే లీజింగ్‌ కంపెనీకి చెందుతుందని పేర్కొంది. దీంతోపాటు తాము కేవలం 1.8 మిలియన్‌ డాలర్లు మాత్రమే బకాయి ఉండగా.. దానిని కూడా ఇటీవల చెల్లించినట్లు పీఐఏ ప్రతినిధి హఫీజ్‌ ఖాన్‌ చెబుతున్నారు. 
 
ఈ విమానాన్ని 2021లో కూడా ఒక సారి మలేసియా అధికారులు లీజ్‌ విషయమై సీజ్‌ చేశారు. కానీ, ఆ తర్వాత బకాయిల చెల్లింపులపై పాకిస్థాన్‌ దౌత్యపరమైన హామీ ఇవ్వడంతో వదిలిపెట్టారు. దీంతో అప్పట్లో 173 మంది ప్రయాణికులు, సిబ్బందితో విమానం పాక్‌కు తిరిగి వెళ్లింది. తాజాగా విమానాన్ని సీజ్‌ నుంచి విడిపించడానికి కౌలాలంపుర్‌లోని న్యాయ సహాయ బృందాలతో పాక్‌ అధికారులు చర్చలు మొదలుపెట్టినట్లు డాన్‌ పత్రిక పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments