Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ విమానాన్ని సీజ్ చేసిన మలేషియా అధికారులు.. ఎందుకని?

Webdunia
బుధవారం, 31 మే 2023 (13:40 IST)
పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకునివున్న పాకిస్థాన్‌కు మలేషియా ప్రభుత్వ అధికారులు తేరుకోలేని షాకిచ్చారు. పాకిస్థాన్ విమానయాన సంస్థ పీఐఏకు చెందిన బోయింగ్ 777 రకం విమానాన్ని సీజ్ చేశారు. ఈ విమానాన్ని లీజుపై మలేసియా నుంచి పీఐఏ తీసుకొంది. కానీ, లీజు బకాయి 4 మిలియన్‌ డాలర్లకు చేరడంతో మంగళవారం ఈ విమానాన్ని కోర్టు ఆదేశాల మేరకు కౌలాలంపూర్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీజ్‌ చేశారు. 
 
వాస్తవానికి లీజ్‌ విషయంలో వివాదం కూడా ఉంది. ఈ విమానం తనదేనని ఎయిర్‌ క్రాఫ్ట్‌ లీజింగ్‌ కంపెనీ వాదిస్తుండగా.. పీఐఏ మాత్రం విమానం ఇంజిన్లలో ఒకటి మాత్రమే లీజింగ్‌ కంపెనీకి చెందుతుందని పేర్కొంది. దీంతోపాటు తాము కేవలం 1.8 మిలియన్‌ డాలర్లు మాత్రమే బకాయి ఉండగా.. దానిని కూడా ఇటీవల చెల్లించినట్లు పీఐఏ ప్రతినిధి హఫీజ్‌ ఖాన్‌ చెబుతున్నారు. 
 
ఈ విమానాన్ని 2021లో కూడా ఒక సారి మలేసియా అధికారులు లీజ్‌ విషయమై సీజ్‌ చేశారు. కానీ, ఆ తర్వాత బకాయిల చెల్లింపులపై పాకిస్థాన్‌ దౌత్యపరమైన హామీ ఇవ్వడంతో వదిలిపెట్టారు. దీంతో అప్పట్లో 173 మంది ప్రయాణికులు, సిబ్బందితో విమానం పాక్‌కు తిరిగి వెళ్లింది. తాజాగా విమానాన్ని సీజ్‌ నుంచి విడిపించడానికి కౌలాలంపుర్‌లోని న్యాయ సహాయ బృందాలతో పాక్‌ అధికారులు చర్చలు మొదలుపెట్టినట్లు డాన్‌ పత్రిక పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments