సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం - వార్ ఫ్లైట్‌ను తరలిస్తున్న పాకిస్థాన్!!

ఠాగూర్
బుధవారం, 23 ఏప్రియల్ 2025 (12:30 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు పైశాచిక దాడికి పాల్పడగా సుమారు 38 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల సరిహద్దుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దీనికి కారణం కూడా పాకిస్థాన్ కావడం గమనార్హం. సరిహద్దుల్లో ఉన్న ఎయిర్ బేస్‌లకు పాకిస్థాన్ తన యుద్ధ విమానాలను తరలించడంతో సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించిన ఆధారాలను నెటిజన్లు ఫ్లైట్ రాడార్ డేటాకు సంబంధించిన క్లిప్పింగులను పోస్టు చేసున్నారు. 
 
ఫ్లైట్ రాడార్ డేటాలో పాకిస్థాన్ వాయుసేన విమానాలు కరాచీలోని దక్షిణ ఎయిర్ కమాండ్ నుంచి లాహోర్, రావల్పిండి సమీపంలోని ఉత్తర వైమానిక స్థావరాలకు చేరుకుంటున్నట్టు కనిపిస్తుంది. రావల్పిండిలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరం పాకిస్థాన్‌ అతి ప్రధానమైన ఆపరేషనల్ బేస్‌లలో ఒకటి. ఈ నేపథ్యంలోనే బేస్ భద్రతా ఏర్పాట్లను పాక్ పటిష్టం చేసినట్టు ప్రచారం సాగుతోంది. అయితే, సరిహద్దులకు యుద్ధ విమానాల తరలింపు వార్తలపై అటు పాకిస్థాన్‌గానీ ఇటు భారత అధికారుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aadi Saikumar: శంబాల చిత్రీకరణలో గాయపడ్డ హీరో ఆది

సెట్‌లో కెమెరా లైట్స్, కెమెరాలు సరిగ్గా పని చేసేవి కావు : జిన్.. దర్శకుడు చిన్మయ్ రామ్

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ హ్యాండ్ చూపిస్తూ కొత్త సినిమా ప్రోమో

Adivi Sesh: తెలుగోడు ఒక హిందీ వోడు కలిసి చేసిన సినిమా డెకాయిట్ : అడివి శేష్

Faria Abdullah: హీరోయిన్స్ అంటే అందంగా కనిపించాలనేం లేదు : ఫరియా అబ్దుల్లా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ తింటే?

దేశ తొలి మిస్ ఇండియా మెహర్ ఇకలేరు...

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

గాజువాక ప్రభుత్వ పాఠశాలలో నాట్స్ సాయంతో గ్రీన్ స్టూడియో

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

తర్వాతి కథనం
Show comments