Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం - వార్ ఫ్లైట్‌ను తరలిస్తున్న పాకిస్థాన్!!

ఠాగూర్
బుధవారం, 23 ఏప్రియల్ 2025 (12:30 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు పైశాచిక దాడికి పాల్పడగా సుమారు 38 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల సరిహద్దుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దీనికి కారణం కూడా పాకిస్థాన్ కావడం గమనార్హం. సరిహద్దుల్లో ఉన్న ఎయిర్ బేస్‌లకు పాకిస్థాన్ తన యుద్ధ విమానాలను తరలించడంతో సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించిన ఆధారాలను నెటిజన్లు ఫ్లైట్ రాడార్ డేటాకు సంబంధించిన క్లిప్పింగులను పోస్టు చేసున్నారు. 
 
ఫ్లైట్ రాడార్ డేటాలో పాకిస్థాన్ వాయుసేన విమానాలు కరాచీలోని దక్షిణ ఎయిర్ కమాండ్ నుంచి లాహోర్, రావల్పిండి సమీపంలోని ఉత్తర వైమానిక స్థావరాలకు చేరుకుంటున్నట్టు కనిపిస్తుంది. రావల్పిండిలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరం పాకిస్థాన్‌ అతి ప్రధానమైన ఆపరేషనల్ బేస్‌లలో ఒకటి. ఈ నేపథ్యంలోనే బేస్ భద్రతా ఏర్పాట్లను పాక్ పటిష్టం చేసినట్టు ప్రచారం సాగుతోంది. అయితే, సరిహద్దులకు యుద్ధ విమానాల తరలింపు వార్తలపై అటు పాకిస్థాన్‌గానీ ఇటు భారత అధికారుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

NBK 111: గోపీచంద్ మలినేని తో గర్జించే సింహంగా ఎన్.బి.కె.111 చిత్రం ప్రకటన

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments