Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 13మంది దుర్మరణం.. 32మందికి గాయాలు

Webdunia
గురువారం, 20 మే 2021 (11:36 IST)
పాకిస్థాన్‌లోని సుక్కూర్‌ జిల్లా దక్షిణ సింద్‌ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తాపడటంతో ఘటనాస్థలంలోనే 13 మంది దుర్మరణం చెందగా.. 32 మందికిపైగా గాయాలయ్యాయి.
 
బస్సు ముల్తాన్‌ నుంచి కరాచీకి వెళ్తుండగా గురువారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు.
 
పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బస్సును క్రేన్‌ సాయంతో పైకి ఎత్తి వాహనంలో చిక్కుకుపోయిన వారిని అతికష్టం మీద బయటకు తీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సుక్కూర్‌ సివిల్‌ హాస్పటల్‌, పాలోఅకిల్‌ తాలూక హాస్పటళ్లకు తరలించారు.
 
గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గాయపడిన వారిని తరలిస్తున్న నేపథ్యంలో సుక్కూర్‌, రోహిర్‌ దవాఖానల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఘటికాచలం: నిర్మాత ఎస్ కేఎన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments