Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రైనీ పైలట్ చేతిలో 305 ప్రయాణికుల ప్రాణాలు... ఫ్లైట్‌లో గుర్రుపెట్టి నిద్రపోయిన పైలట్..

పాకిస్థాన్ పాలకులే కాదు.. ఆ దేశానికి చెందిన విమానయాన సంస్థ పైలట్లు కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతారని మరోమారు నిరూపితమైంది. ఏకంగా 305 మంది ప్రయాణికుల ప్రాణాలను ట్రైనీ పైలట్ చేతిలో పెట్టిన ఓ పైలట్..

Webdunia
సోమవారం, 8 మే 2017 (09:28 IST)
పాకిస్థాన్ పాలకులే కాదు.. ఆ దేశానికి చెందిన విమానయాన సంస్థ పైలట్లు కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతారని మరోమారు నిరూపితమైంది. ఏకంగా 305 మంది ప్రయాణికుల ప్రాణాలను ట్రైనీ పైలట్ చేతిలో పెట్టిన ఓ పైలట్.. క్యాబిన్‌లో గుర్రుపెట్టి నిద్రపోయాడు. అలా ఏకంగా రెండున్నర గంటల పాటు నిద్రపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
గత నెల 26న పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌ నుంచి లండన్‌కు పాక్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌(పీఐఏ)కు చెందిన ఓ విమానం ఒకటి బయలుదేరింది. ఈ విమానం టేకాఫ్‌ తీసుకున్న కొద్దిసేపటికే పైలట్‌ కెప్టెన్‌ అమీర్‌ అక్తర్‌ హష్మీ.. తన బాధ్యతలను ట్రైనీ పైలట్‌ మహ్మద్‌ అసద్‌ అలీకి అప్పగించాడు. 
 
ఆ తర్వాత ఆయనగారు బిజినెస్‌ క్లాస్‌లోకి వెళ్లి ఏకంగా రెండున్నర గంటలపాటు నిద్రపోయాడు. ఈ దృశ్యాన్ని ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టాడు. ఘటనపై పీఐఏ అధికారులకు ఫిర్యాదు చేశాడు. స్పందించిన అధికారులు సదరు పైలట్‌ను విధుల నుంచి తొలగించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments