Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కు చైనా మెడికల్ కిట్లు.. వాడేసినవా? నాసికరకమా?

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (19:31 IST)
కరోనా కష్టకాలంలో అనేక ప్రపంచ దేశాలకు భారతదేశం ఔషధాల రూపంలో సహాయం చేస్తూ పెద్దన్న పాత్రను పోషిస్తోంది. ఇపుడు భారత్‌కు చైనా సహాయం చేస్తోంది. భారత్‌కు అవసరమైన (వ్యక్తిగత సంరక్షణ పరికరాలు) మెడికల్ కిట్లను చైనా ఎగుమతి చేస్తోంది. 
 
అయితే, చైనా పంపిస్తున్న పీపీఈ కిట్ల నాణ్యతపైనే ఇపుడు పలువురుకి అనేక రకాలైన సందేహాలు వస్తున్నాయి. చైనా కిట్లు, మాస్కులపై ఇప్పటికే ఇటలీ, అమెరికా, స్పెయిన్ దేశాలు ఫిర్యాదు చేశాయి. 
 
మరోవైపు భారత్‌కు చైనా పంపిన సామగ్రిలో కూడా డొల్లతనం బయటపడింది. ఇండియాకు పంపిన కిట్లలో దాదాపు 30 శాతం కిట్లలో నాణ్యత లేదని, మరికొన్ని వాడేసినట్టుగా ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. 
 
కాగా, ప్రస్తుత కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ పీపీఈ కిట్లకు ప్రపంచ వ్యాప్తంగా భారీ డిమాండ్ ఏర్పడింది. పలు దేశాలు విదేశాల నుంచి పెద్ద ఎత్తున వీటిని కొనుగోలు చేస్తున్నాయి. వీటిని తయారు చేసి, ఎగుమతి చేస్తున్న దేశాలలో చైనానే ముందు వరుసలో ఉండటం గమనార్హం.  

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments