Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరిగిపడిన కొండచరియలు.. 36 మంది మృత్యువాత

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (10:51 IST)
దక్షిణ అమెరికాలో పెను విషాదం నెలకొంది. ప్రకృతి ప్రకోపం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో 36 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. సౌత్ అమెరికాలోని పెరూలో ప్రతి యేటా ఫిబ్రవరి నెలలో విస్తారంగా వర్షాలు కురుస్తుంటాయి. ఈ యేడాది కూడా గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా, దక్షిణ పెరూలోని క్యామనా ప్రావిన్స్‌లో ఇటీవల భారీ వర్షాలు కురుస్తున్నాయి. 
 
ఈ వర్షాల ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. కొండ దిగువున ఉన్న గ్రామాలకు భారీ నష్టం కలుగుతోంది. పెద్ద రాళ్లు, మట్టి వంటవి పడటంతో అనేక మంది చనిపోతున్నారు. అనేక గృహాలు పూర్తిగా ధ్వంసమవుతున్నాయి. కొండ చరియలు విరిగిపడుతున్న ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. 
 
అలాగే, క్షతగాత్రులను రక్షించి ఆస్పత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. అధికారుల అంచనా ప్రకారం ఈ కొండ చరియలు విరిగి పడటం వల్ల దాదాపు 700కి పైగా గృహాలు దెబ్బతిన్నట్టు తెలిపారు. బాధిత ప్రాంతాల్లో తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేసి హెలికాఫ్టర్ల ద్వారా ఆహారం, నీటిని సరఫరా చేస్తున్నారు. కాగా, ఈ స్థాయిలో కొండ చరియలు విరిగిపడటం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి అని వారు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments