Webdunia - Bharat's app for daily news and videos

Install App

నర్సు కాదు కిరాతకురాలు.. నవజాత శిశువులు ఎనిమిది మందిని..?

Webdunia
గురువారం, 12 నవంబరు 2020 (11:26 IST)
దేశంలో కాదు.. ప్రపంచ దేశాల్లోనూ నేరాల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా అభంశుభం తెలియని నవజాత శిశువులను ఓ నర్సు పొట్టనబెట్టుకుంది. పురుడు పోయాల్సిన నర్సు.. అప్పుడే పుట్టిన చిన్నారులను చిదిమేసింది. ఆమె పనిచేస్తున్న దవాఖానలోనే ఇప్పటివరకు ఎనిమిదిమంది నవజాత శిశువులను చంపింది. మరో పది మంది చిన్నారుల ప్రాణాలను తీయడానికి ప్రయత్నించింది. ఆఖరుకు పోలీసులకు దొరికిపోయి ఊచలు లెక్కబెడుతోంది.
 
వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌లోని నార్త్‌వెస్టర్న్ ఇంగ్లిష్ సిటీలో ఉన్న ఓ స్థానిక దవాఖానలో లూసీ లెట్ బే అనే నర్సు పనిచేస్తుంది. దవాఖానలో అప్పుడే పుట్టిన చిన్నారులను చంపేస్తున్నదనే అభియోగాలపై పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. 
 
2015, జూన్ నుంచి 2016 జూన్ వరకు కౌంటెస్ ఆఫ్‌ చెస్టర్ దవాఖానలోని నియోనటల్ యూనిట్‌లో ఎనిమిది మంది చిన్నారులను చంపేసిందని, మరో పది మంది శిశువులపై హత్యాయత్నం చేసిందని తెలిపారు. ఆమెను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుచనున్నారు. గతంలో 2018, 2019లోకూడా ఇవే ఆరోపణలపై ఆ నర్సును పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆరోపణలు రుజువుకాకపోవడంతో ఆమెను విడుదల చేయడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments