Webdunia - Bharat's app for daily news and videos

Install App

నర్సు కాదు కిరాతకురాలు.. నవజాత శిశువులు ఎనిమిది మందిని..?

Webdunia
గురువారం, 12 నవంబరు 2020 (11:26 IST)
దేశంలో కాదు.. ప్రపంచ దేశాల్లోనూ నేరాల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా అభంశుభం తెలియని నవజాత శిశువులను ఓ నర్సు పొట్టనబెట్టుకుంది. పురుడు పోయాల్సిన నర్సు.. అప్పుడే పుట్టిన చిన్నారులను చిదిమేసింది. ఆమె పనిచేస్తున్న దవాఖానలోనే ఇప్పటివరకు ఎనిమిదిమంది నవజాత శిశువులను చంపింది. మరో పది మంది చిన్నారుల ప్రాణాలను తీయడానికి ప్రయత్నించింది. ఆఖరుకు పోలీసులకు దొరికిపోయి ఊచలు లెక్కబెడుతోంది.
 
వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌లోని నార్త్‌వెస్టర్న్ ఇంగ్లిష్ సిటీలో ఉన్న ఓ స్థానిక దవాఖానలో లూసీ లెట్ బే అనే నర్సు పనిచేస్తుంది. దవాఖానలో అప్పుడే పుట్టిన చిన్నారులను చంపేస్తున్నదనే అభియోగాలపై పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. 
 
2015, జూన్ నుంచి 2016 జూన్ వరకు కౌంటెస్ ఆఫ్‌ చెస్టర్ దవాఖానలోని నియోనటల్ యూనిట్‌లో ఎనిమిది మంది చిన్నారులను చంపేసిందని, మరో పది మంది శిశువులపై హత్యాయత్నం చేసిందని తెలిపారు. ఆమెను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుచనున్నారు. గతంలో 2018, 2019లోకూడా ఇవే ఆరోపణలపై ఆ నర్సును పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆరోపణలు రుజువుకాకపోవడంతో ఆమెను విడుదల చేయడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments