Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణ కొరియా నుంచి ఉత్తర కొరియాకు కరోనా.. కిమ్ సీరియస్..

Webdunia
ఆదివారం, 26 జులై 2020 (11:30 IST)
ఉత్తర కొరియాలో కరోనా వైరస్ నమోదు కావడం మొదలైంది. దీంతో ఉత్తర కొరియా అప్రమత్తత చర్యలు చేపట్టింది. దక్షిణ కొరియా నుంచి వచ్చిన వ్యక్తి వల్లే దేశంలోకి ఈ వైరస్‌ చొరబడినట్లు అక్కడి ప్రభుత్వ న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది. మూడేళ్ల క్రితం దక్షిణ కొరియాకు పారిపోయిన వ్యక్తి ఇటీవల దేశానికి తిరిగి వచ్చాడని.. అతనిలో వైరస్‌ లక్షణాలు ఉన్నట్లు పేర్కొంది.
 
దీంతో దేశాధినేత కిమ్‌జోంగ్‌ ఉన్‌ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అనంతరం సరిహద్దుల్లోని కైసాంగ్‌ నగరంలో లాక్‌డౌన్‌ విధించారు. ''సరిహద్దుల్లోని కైసాంగ్‌ నగరంలో అనుకోని ఘటన జరిగింది. మూడేళ్ల క్రితం దేశం నుంచి దక్షిణ కొరియాకు పారిపోయిన వ్యక్తి జులై 19 తిరిగి వచ్చాడు. అతనిలో కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నాయి. అతను అక్రమంగా దేశ సరిహద్దులు దాటాడు'' అని కేసీఎన్‌ఏ పేర్కొంది.
 
ఇటీవలే వైరస్‌పై విజయం సాధించామని ప్రకటించిన కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు తాజా ఘటన ఆగ్రహం తెప్పించింది. వీలైనన్ని అత్యవసర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అసలు ఆ వ్యక్తి సరిహద్దులు ఎలా దాటాడో కనుగొనాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు కారకులపై కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్రాలపై నయనతారకు ఎందుకో అంత ఇష్టం??

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం