సౌదీ అరేబియా తీపి కబురు చెప్పింది. భారతదేశంలో వుండి సౌదీకి ఎప్పుడు తిరిగి వెళ్లాలా అని ఎదురుచూస్తున్నవారికి ఉపశమనం కలిగించే ప్రకటన చేసింది. రెండు డోసుల టీకాలు తీసుకున్నవారు ఇకపై క్వారెంటైన్లో వుండక్కర్లేదనీ, నేరుగా వచ్చేయవచ్చని తెలిపింది. ఐతే ఆ రెండు డోసులు సౌదీలో తీసుకున్నవారికి మాత్రమే వర్తిస్తుందని వెల్లడించింది.