Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి పీటలపై నుంచి కటకటాల వెనక్కి! ఎందుకు? ఎక్కడ?

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (10:01 IST)
ఎన్నో ఊహలతో పెళ్లి పీటలెక్కింది ఓ జంట. ఇక స్వర్గపుటంచుల వరకూ వెళ్లేందుకు సిద్ధమైంది. ఇందుకు పెద్దల ఆశీస్సులు, తోటివారి సలహాలు తీసుకుంది. కానీ ఇంతలోనే పోలీసులు వచ్చి బెడ్రూం లోకి వెళ్లాల్సిన ఆ జంటను జైలుకు తీసుకెళ్లి పోయారు.

దక్షిణాఫ్రికాలో ఈ ఘటన జరిగింది. ఇందుకు కరోనా లాక్ డౌన్ కారణమైంది. వివరాల్లోకి వెళితే... 48 ఏళ్ల జబులాని జులు అనే వ్యక్తి  నొమ్తాండాజొ మెక్ జీ (38)ని వివాహం చేసుకున్నాడు. క్వాజులు- నటాల్ అనే ప్రాంతంలో ఈ పెళ్లి జరిగింది.

అయితే కరోనా నేపథ్యంలో ప్రజలు గుమికూడడంపై అక్కడ నిషేధం ఉంది. అయినా.. జులు, మెక్‌ జీ పెళ్లి వేడుక జరుగుతున్న విషయం తెలియడంతో ఆయుధాలు ధరించిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వేడుకను నిలిపివేసి వధూవరులతో పాటు పెళ్లికి వచ్చిన యాభై మందికి పైగా కుటుంబ సభ్యులు, అతిథులను అరెస్ట్ చేశారు.

అందరినీ పోలీస్‌ స్టేషన్‌కు తరలించి.. ఒక్కొక్కరికి రూ. 4100 పూచికత్తుతో బెయిల్ ఇచ్చారు. కాగా, దక్షిణాఫ్రికాలో ఇప్పటిదాకా 1700 పైచిలుకు కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ దేశంలో ఈనెల 16 వ తేదీ వరకూ లాక్‌డౌన్‌ అమల్లో ఉండనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments