Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఓ వైపు.. ఎబోలా మరోవైపు.. నలుగురు మృతి ఎక్కడ?

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (11:24 IST)
ebola virus
ఒకవైపు కరోనా ప్రపంచ దేశాలను అట్టుడికిస్తుంటే.. ఎబోలా వైరస్ మళ్లీ తొంగిచూసింది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు పశ్చిమాన ఎబోలా వ్యాప్తి చెందడంతో నలుగురు మృతి చెందారని ఆరోగ్య మంత్రి ఎటెని తెలిపారు. 
 
ఈక్వటేర్ ప్రావిన్స్‌లోని పశ్చిమ నగరమైన ఎంబండకాలో ఈ అంటువ్యాధులు గుర్తించినట్లు ఎటెని లాంగోండో సోమవారం చెప్పారు. ఇప్పటికే నలుగురు మృతి చెందగా.. ఇంకా నాలుగు అనుమానాస్పద కేసులు ఉన్నాయని వారు చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. 
 
డబ్ల్యూహెచ్‌వో రిపోర్ట్ ప్రకారం, ఈక్వెటూర్ ప్రావిన్స్‌లో చివరిసారిగా 2018లో 54 కేసులు, 33 ఎబోలా మృతులు నమోదైనాయి. కాంగో దేశంలోని తూర్పు భాగంలో చరిత్రలో రెండవ అతిపెద్ద ఎబోలా మహమ్మారిని తరిమికొట్టేందుకు కాంగో ఇప్పటికీ శ్రమిస్తోంది. ఈ క్రమంలో రెండు కొత్త వ్యాక్సిన్లను ఉపయోగించినప్పటికీ.. 2,260 మందికి పైగా మరణించారు. 
 
ఇప్పటికే కోవిడ్ -19 కేసుల పెరుగుదలతో ఆ దేశం నానా తంటాలు పడుతోంది. మే 31 నాటికి 3,195 మంది అంటువ్యాధుల బారిన పడగా, మృతి చెందారు. కానీ ఈక్వేటూర్ ప్రావిన్స్‌లో ఇప్పటివరకు కోవిడ్ -19 కేసులు కనుగొనబడలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా, పర్యాటక రంగాలకు జీఎస్టీ స్లాబు ఊతం :కందుల దుర్గేష్

లిటిల్ హార్ట్స్ సక్సెస్ అవుతుందని ముందే చెప్పా : మౌళి తనుజ్

JD Chakravarthy: డబ్బుని మంచినీళ్లు లాగా ఖర్చు పెడుతున్నారు : జెడీ చక్రవర్తి

Nani: మోహన్ బాబు కీలక పాత్రలో నాని ది ప్యారడైజ్ చిత్రం

Allu Arjun: అల్లు అర్జున్, శిరీష్, కిరణ్ అబ్బవరం దుబాయ్‌ లాండ్ అయ్యారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments