Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూర్పు కాంగోలో మళ్లీ బయటపడిన ఎబోలా కేసు

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (15:22 IST)
తూర్పు కాంగో దేశంలో మళ్లీ ఎబోలా కేసు ఒకటి నమోదైంది. ఆ రాష్ట్ర వైద్య శాఖామంత్రి శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. గత ఐదు నెలల తర్వాత ఈ కేసు నమోదైంది. ఈ ఎబోలా వైరస్ కారణంగా గత 2018-20 మధ్య కాలంలో తూర్పు కాంగోలో 2,200 మందికి పైగా మరణించారు. ఈ యేడాది ఈ వైరస్ ధాటికి ఇప్పటికే కొందరు చనిపోయారు. 
 
2018-2020 వ్యాప్తికి కేంద్రబిందువులలో ఒకటైన తూర్పు నగరం బెని సమీపంలో 3 ఏళ్ల బాలుడు పాజిటివ్‌గా పరీక్షించబడ్డాడు. ఈ బాలుడు ఈ వ్యాధితో మరణించినట్లు ఆరోగ్య మంత్రి జీన్ జాక్వ్స్ మ్బుంగాని ఒక ప్రకటనలో తెలిపారు.
 
అలాగే, ఎబోలా వైరస్ బారినపడిన మరో వంద మందిని వైద్యశాఖ అధికారులు గుర్తించారు. వీరిలో కనిపించే లక్షణాలపై శాస్త్రవేత్తలు ఆరా తీస్తున్నారు. 
 
కాంగో యొక్క బయోమెడికల్ లాబొరేటరీ నుండి వచ్చిన అంతర్గత నివేదిక ప్రకారం, బెని యొక్క జనసాంద్రత కలిగిన బుట్సిలి పరిసరాల్లోని పసిపిల్లల పొరుగువారిలో ముగ్గురు కూడా గత నెలలో ఎబోలాకు సంబంధించిన లక్షణాలను కనిపిస్తున్నాయి. కానీ ఈ ప్రాంత వాసులు ఎబోలా వైరస్ పెద్దగా అవగాహన లేకపోవడంతో పెద్దగా పట్టించుకోవడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments