Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవాజ్ షరీఫ్‌ అవినీతికి పాల్పడ్డారు... నిర్ధారించిన కోర్టు

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన అవినీతికి పాల్పడింది నిజమేనని, అందువల్ల ఆయనపై అభియోగాలు నమోదు చేయాలని ఆదేశించింది. అలాగే, షరీఫ్ కుమార్తె మర్యమ్, అల్లుడు మ

Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2017 (09:41 IST)
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన అవినీతికి పాల్పడింది నిజమేనని, అందువల్ల ఆయనపై అభియోగాలు నమోదు చేయాలని ఆదేశించింది. అలాగే, షరీఫ్ కుమార్తె మర్యమ్, అల్లుడు మహమ్మద్ సఫ్దర్‌పైన అభియోగాలనూ పాక్ అవినీతి నిరోధక కోర్టు నిర్ధారించింది. అక్రమాస్తుల కేసులో వీళ్లను దోషులుగా తేల్చిన కోర్టు వీరిపై అవినీతి కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీచేసింది. 
 
బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్‌లో నవాజ్ షరీఫ్ కూతురు, ఇద్దరు కొడుకుల పేర్ల మీద రిజిస్టర్ అయిన ఆఫ్‌షోర్‌ కంపెనీలను ఉపయోగించి లండన్‌లో ఆస్తులను కొనుగోలు చేసినట్లు 2016లో లీక్ అయిన పనామా పేపర్స్ ద్వారా బయటపడింది. దీంతో నవాజ్ ఫ్యామిలీ ఆస్తులపై దర్యాప్తు చేయాలని అధికారులను సుప్రీం ఆదేశించింది. దర్యాప్తు తర్వాత సుప్రీం నవాజ్‌ను ప్రధాని పదవికి అనర్హుడిని చేసి నవాజ్ ఫ్యామిలీ ఆస్తులపై దర్యాప్తు చేయాలని నేషనల్ అకౌంటబిలిటీ బ్యురో(ఎన్‌ఏబీ)ని ఆదేశించింది. దీంతో గత జులైలో నెలలో ఆయన ప్రధానమంత్రి పీఠం నుంచి దిగిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments