Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్ మంత్రివర్గంలో నారాయణమూర్తి అల్లుడు

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు బ్రిటన్ మంత్రివర్గంలో చేరారు. ఆయనతో పాటు మరో భారతీయ సంతతికి చెందిన ఎంపీకి ఆ దేశ ప్రధానమంత్రి థెరిసా మే తన మంత్రివర్గంలో చోటుకల్పించారు.

Webdunia
బుధవారం, 10 జనవరి 2018 (18:52 IST)
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు బ్రిటన్ మంత్రివర్గంలో చేరారు. ఆయనతో పాటు మరో భారతీయ సంతతికి చెందిన ఎంపీకి ఆ దేశ ప్రధానమంత్రి థెరిసా మే తన మంత్రివర్గంలో చోటుకల్పించారు. 
 
థెరిసా మేకు చెందిన కన్జర్వేటివ్ ప్రభుత్వం తాజాగా తన మంత్రిమండలిని విస్తరించింది. కొత్తగా మంత్రి బాధ్యతలు దక్కిన భారతీయ సంతతి వారిలో రిషి సునక్‌తో పాటు సుయెల్ల ఫెర్నాండేజ్ ఉన్నారు. ఎంపీ ఫెర్నాండేజ్ పూర్వీకులు గోవాకు చెందినవారు. అయితే భారతీయ సంతతి ఎంపీలు ఇద్దరూ బ్రిగ్జిట్‌కు అనుకూలంగా ఓటేశారు. 
 
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు సునక్ బ్రిటన్ ప్రభుత్వంలో హౌజింగ్ శాఖ మంత్రిగా చేయ‌నున్నారు. నార్త్ యార్క్‌షైర్‌లోని రిచ్‌మండ్ నుంచి 2015లో తొలిసారి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2017 మళ్లీ ఎన్నికయ్యారు. 37 ఏళ్ల రిషి సునక్.. ఆక్స్‌ఫర్డ్, స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు. స్టాన్‌ఫర్డ్ వర్సిటీలో నారాయణమూర్తి కుమార్తె అక్షత మూర్తితో సునక్‌కు పరిచయమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments