మయన్మార్లో సంభవించిన భారీ భూకంపం ఆ దేశ ప్రజలను వణికించింది. ఓ బహుళ అంతస్తుల హోటల్లో ఓ జంట స్విమ్మింగ్ పూల్ లో హాయిగా సేద తీరుతున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా స్విమ్మింగ్ పూల్ నీళ్లలో అలజడి మొదలైంది. అవి కాస్తా పెద్దపెద్ద తెప్పలుగా మారడంతో ఏదో ఉపద్రవం సంభవిస్తుందని గమనించిన జంట ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసారు. కాగా మయన్మార్ భూకంపం ధాటికి ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 1,000 దాటిందనీ, కనీసం 2వేల మందికి పైగా గాయపడ్డారని అక్కడి అధికారులు వెల్లడించారు.
శుక్రవారం 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపంలో తీవ్రంగా దెబ్బతిన్న మాండలేలోని భవనాల్లో స్కై విల్లా కండోమినియం ఒకటి, దాని 12 అంతస్తులలో చాలా వరకు ఒకదానిపై ఒకటి కుప్పకూలిపోయాయి. ఈ భవనంలో ఎంతమంది చిక్కుకుని వున్నారోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.