Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకలో దిగజారిన పరిస్థితులు - కుటుంబ పోషణ కోసం వేశ్యలుగా మహిళలు

Webdunia
గురువారం, 21 జులై 2022 (16:55 IST)
శ్రీలంకలో పరిస్థితులు నానాటికీ మరింత అధ్వాన్నంగా దిగిజారిపోతున్నాయి. దీంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా, శ్రీలంక దేశం పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో చిక్కుకునిపోయింది. దీంతో ప్రజల జీవన ప్రయాణం కూడా మరింత దుర్భలంగా మారింది. ఈ క్రమంలో శ్రీలంక మహిళలు కుటుంబ పోషణ నిమిత్తం వ్యభిచారం చేస్తున్నారు. ఇలాంటి వారిని పోలీసులు కూడా చూసీచూడనట్టుగా వదిలివేస్తున్నారు. 
 
శ్రీలంక ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. ప్రస్తుతం శ్రీలంకలో కిలో టమోటాలు రూ.200కు పైగానే ధర పలుకుతుంది. అలాగే, కిలో క్యారెట్ రూ.500, కిలో మిర్చి రూ.700 చొప్పున పలుకుంది. ఇక పెట్రోల్, డీజిల్, గ్యాస్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. కనీసం చంటిబిడ్డలకు సైతం పాలపొడి లభించక అలమటిస్తున్నారు. 
 
ఈ పరిస్థితుల్లో శ్రీలంక మహిళలు వేశ్య వృత్తిని ఎంచుకుంటున్నారు. గత కొన్ని రోజుల్లోనే శ్రీలంకలో వేశ్యవృత్తిలో నిమగ్నమైన మహిళల సంఖ్య ఏకంగా 30 శాతానికి పెరిగింది. కుటుంబ పోషణకు తమకు అంతకుమించి మరోమార్గం కనిపించడం లేదని వారు బోరున విలపిస్తూ చెబుతున్నారు. ఇక్కడ విస్మయం కలిగించే విషయం ఏంటంటే.. నూతనంగా వెలిసిన వ్యభిచార గృహాలకు పోలీసులు కూడా తమ వంతు సహకారం అందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments