Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రీ శవం వద్ద మోడల్ సెక్సీ ఫోటోషూట్!

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (08:47 IST)
సాధారణంగా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా భౌతికంగా దూరమైతే ఆ ఇంట్లో విషాదం నెలకొంటుంది. అదీకూడా కన్నతండ్రి చనిపోతే చెప్పనక్కర్లేదు. తండ్రిని తలుచుకొని ఏడుస్తూ, తల్లిని, తోబుట్టువులను ఓదారుస్తూ ఉంటుంది. 
 
కానీ, ఇక్కడ మనం చెప్పుకోబోయే ఒక యువతి మాత్రం అందుకు విరుద్ధం. తండ్రి చనిపోయాడనే బాధే లేకుండా.. అతని మృతదేహం వద్ద సెక్సీ ఫోటోషూట్ చేసింది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెద్ద ఘన కార్యం చేసినట్లు పోస్ట్ చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా విమర్శల పాలయ్యింది. ఈ ఘటన అమెరికాలో వెలుగు చూసింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మియామీ సిటీకి చెందిన జేన్ రివేరా ఒక టిక్ టాక్ స్టార్‌గా గుర్తింపు పొందారు. ఈమెకు కొద్దిగా పేరు ప్రఖ్యాలు, గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలో ఇటీవల ఆమె తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు. ఉన్నంతలోనే అంత్యక్రియలు నిర్వహించారు. ఇంతవరకు బాగానేవుంది. 
 
అయితే, ఈ యువతి మాత్రం తన తండ్రి చావును పబ్లిసిటీ స్టంట్‌గా వాడుకుంది. తండ్రి మృతదేహాన్ని పక్కన పెట్టుకొని సెక్సీ పోజులతో ఫోటోలకు రెడీ అయిపోయింది. అదేదో సినిమా, యాడ్ షూట్ లా తండ్రి శవం పక్కన నవ్వుతూ నిలబడింది. అంతేకాకుండా ఆ ఫోటోలను షేర్ చేస్తూ 'నా సీతాకోక చిలుక ఎగిరిపోతుంది.. నీ ఆత్మకు శాంతి కలగాలి నాన్నా.. రెస్ట్ ఇన్ పీస్' అంటూ పోస్ట్ చేసింది. 
 
మిగతా విషయాలలో అమ్మడిని సపోర్ట్ చేసిన ఆమె ఫాలోవర్స్ .. ఈ విషయంలో మాత్రం విమర్శలు చేస్తున్నారు. ఇంత బాధలో ఉన్నా కూడా నీకు ఫోటో షూట్ అవసరమా..? అని కొందరు.. మరి దారుణం ఇది అని మరికొందరు ఆమెను విమర్శిస్తున్నారు. ఇవేమి పట్టించుకోని జేన్ .. నేను చేసిన దానిలో తప్పేముంది అంటూ ఎదురు ప్రశ్నించడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం