మయన్మార్‌లో ఘోర విమాన ప్రమాదం.. 12మంది దుర్మరణం

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (13:52 IST)
భారత సరిహద్దు దేశం మయన్మార్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మిలటరీ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 12 మంది మరణించారు. విమాన పైలట్‌తో పాటు మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. మయన్మార్‌లో రెండో అతి పెద్ద నగరమైన మాండలేలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మయన్మార్ మిలటరీ విమానం రాజధాని నేపిడా నుంచి పియన్‌వూ ల్విన్‌కు బయలుదేరింది. ఈ క్రమంలోనే అదుపుతప్పి మాండలేలోని స్టీల్ ప్లాంట్‌ సమీపంలో కుప్పకూలింది. దాదాపు 984 ఫీట్ల ఎత్తు నుంచి కిందపడిపోయినట్లు మిలటరీ నేతృత్వంలోని మియవాడి టెలివిజన్ తెలిపింది. 
 
విమానంలో ఆరుగురు మిలటరీ సిబ్బందితో పాటు పలువురు సాధువులు ఉన్నారు. వారంతా ఓ బుద్దిస్ట్ మఠానికి వెళ్లాల్సి ఉందని అంతలోనే ఈ ఘోర జరిగిందని అధికారులు పేర్కొన్నారు. ఐతే విమాన ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments