Webdunia - Bharat's app for daily news and videos

Install App

మయన్మార్‌లో ఘోర విమాన ప్రమాదం.. 12మంది దుర్మరణం

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (13:52 IST)
భారత సరిహద్దు దేశం మయన్మార్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మిలటరీ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 12 మంది మరణించారు. విమాన పైలట్‌తో పాటు మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. మయన్మార్‌లో రెండో అతి పెద్ద నగరమైన మాండలేలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మయన్మార్ మిలటరీ విమానం రాజధాని నేపిడా నుంచి పియన్‌వూ ల్విన్‌కు బయలుదేరింది. ఈ క్రమంలోనే అదుపుతప్పి మాండలేలోని స్టీల్ ప్లాంట్‌ సమీపంలో కుప్పకూలింది. దాదాపు 984 ఫీట్ల ఎత్తు నుంచి కిందపడిపోయినట్లు మిలటరీ నేతృత్వంలోని మియవాడి టెలివిజన్ తెలిపింది. 
 
విమానంలో ఆరుగురు మిలటరీ సిబ్బందితో పాటు పలువురు సాధువులు ఉన్నారు. వారంతా ఓ బుద్దిస్ట్ మఠానికి వెళ్లాల్సి ఉందని అంతలోనే ఈ ఘోర జరిగిందని అధికారులు పేర్కొన్నారు. ఐతే విమాన ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments