Webdunia - Bharat's app for daily news and videos

Install App

యెమెన్‌లో ఘోర విషాదం.. 68 మంది అక్రమ వలసదారుల జలసమాధి

ఠాగూర్
సోమవారం, 4 ఆగస్టు 2025 (08:51 IST)
యెమెన్ దేశంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. అక్రమ వలసదారులతో వెళుతున్న పడవ ఒకటి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 68 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 74 మంది గల్లంతయ్యారు. ఆదివారం ఈ విషాదం చోటు చేసుకుంది. మొత్తం 154 మంది ప్రయాణికులతో వెళుతున్న పడవ ఒకటి యెమెన్ అభ్యాన్ ప్రావిన్స్‌ వద్ద ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా సముద్రంలో బోల్తాపడింది. దీంతో 154 మంది నీటిపై పడిపోయారు. కేవలం 12 మంది మాత్రమే క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. మిగిలిన అందరూ నీటిలో కొట్టుకునిపోగా, 68 మంది జలసమాధి అయ్యారు. 
 
54 మంది శవాలు ఖాన్ఫర్ జిల్లాలోని సముద్ర తీరానికి కొట్టుకు వచ్చాయి. మరికొన్ని శవాలు వేరే ప్రాంతంలో కనిపించాయి. ఆ శాలను మార్చురీకి తరలించారు. మిగిలిన 74 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, ఈస్ట్ ఆఫ్రికాకు చెందిన వలసదారులు పెద్ద సంఖ్యలో  గల్ఫ్ దేశాలకు పనుల కోసం వెళుతుంటారు. స్మగ్లర్లు వారిని పడవల ద్వారా ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌ల మీదుగా అరబ్ దేశాలకు తరలిస్తూ ఉంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Aravind: పవన్ కళ్యాణ్ కు అల్లు అరవింద్ సవాల్ - టైం ఇస్తే వారితో సినిమా చేస్తా

Film chamber: కార్మికుల ఫెడరేషన్ వర్సెస్ ఫిలింఛాంబర్ - వేతనాల పెంపుకు నో చెప్పిన దామోదరప్రసాద్

AI : సినిమాల్లో ఎ.ఐ. వాడకం నష్టమే కల్గిస్తుంది : అల్లు అరవింద్, ధనుష్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments