Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య కాపురానికి రాలేదని నిప్పంటించుకున్న భర్త....

ఠాగూర్
సోమవారం, 4 ఆగస్టు 2025 (08:30 IST)
ఏపీలోని ఒంగోలు జిల్లా మార్కాపురంలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కట్టుకున్న భార్య కాపురానికి రాకపోవడంతో భర్త ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ సంఘటన ఆదివారం మార్కాపురం మండలంలోని రాయవరంలో చోటుచేసుకుంది. 
 
మార్కాపురం గ్రామీణ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. దొనకొండ మండలంలోని మల్లంపేట గ్రామానికి చెందిన వనమాల బ్రహ్మయ్య అనే వ్యక్తి మార్కాపురం మండలంలోని రాయవరం గ్రామానికి చెందిన చెన్నమ్మను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు. అయితే, దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల కూలి పనుల కోసం ఇతర ప్రాంతానికి వలస వెళ్లిన సందర్భంగా భార్య చెన్నమ్మను భర్త కొట్టడంతో ఆమె పిల్లలను తీసుకని రాయవరంలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం మనస్తాపానికి గురైన భర్త పెట్రోల్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు మంటలు అదుపు చేసి 108కు సమాచారం అందజేయడంతో సిబ్బంది వచ్చి మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 40 శాతం కాలిన గాయాలు కావడంతో ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు.. మెరుగైన వైద్యం కోసం ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Aravind: పవన్ కళ్యాణ్ కు అల్లు అరవింద్ సవాల్ - టైం ఇస్తే వారితో సినిమా చేస్తా

Film chamber: కార్మికుల ఫెడరేషన్ వర్సెస్ ఫిలింఛాంబర్ - వేతనాల పెంపుకు నో చెప్పిన దామోదరప్రసాద్

AI : సినిమాల్లో ఎ.ఐ. వాడకం నష్టమే కల్గిస్తుంది : అల్లు అరవింద్, ధనుష్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments