Webdunia - Bharat's app for daily news and videos

Install App

సముద్రపు తాబేలుపై ఎక్కి నిల్చుని తైతక్కలాడారు.. ఇడియట్స్ అంటూ సోషల్ మీడియాలో విమర్శలు

సెల్ఫీ పిచ్చితో మూగజీవులకు కష్టాలు తెచ్చిపెడుతున్నారు... సోషల్ మీడియా ప్రేమికులు. తాజాగా ఆస్ట్రేలియా క్వీన్స్‌లాండ్‌కు చెందిన రికీ రోజర్స్ అనే వ్యక్తి తన ఫేస్ బుక్‌లో వివాదాస్పద ఫోటో పెట్టి కష్టాలను క

Webdunia
బుధవారం, 2 నవంబరు 2016 (17:50 IST)
సెల్ఫీ పిచ్చితో మూగజీవులకు కష్టాలు తెచ్చిపెడుతున్నారు... సోషల్ మీడియా ప్రేమికులు. తాజాగా ఆస్ట్రేలియా క్వీన్స్‌లాండ్‌కు చెందిన రికీ రోజర్స్ అనే వ్యక్తి తన ఫేస్ బుక్‌లో వివాదాస్పద ఫోటో పెట్టి కష్టాలను కొనితెచ్చుకున్నాడు. రోజర్స్ అనే వ్యక్తి వేరో వ్యక్తితో కలిసి.. సముద్రపు తాబేలుపై ఎక్కి నిల్చుని తైతక్కలాడారు. అంతటితో ఆగకుండా ఈ ఫోటోను ఫేస్ బుక్‌లో పెట్టేశారు. ఈ చర్యపై నెటిజన్లతో పాటు జంతు ప్రేమికులు కూడా ఫైర్ అవుతున్నారు. 
 
ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో ఈ ఫోటోను తీసినట్లు రికీ రోజర్స్ తెలిపాడు. అతని పోస్టుపై సోషల్‌ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. బుర్రలేని ఈ మూర్ఖులకు తగిన బుద్ధి చెప్పాల్సిందేనని నెటిజన్లు కోపంతో ఊగిపోతున్నారు. ఇంకా వీరిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇకపోతే ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఇద్దరు ఇడియట్ల చర్య వల్ల ఆ తాబేలు చనిపోయి ఉంటుందని క్వీన్స్‌లాండ్‌ పార్క్స్ వైల్డ్‌లైఫ్‌ సర్వీస్‌ తెలిపింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Praveen: మారుతీ వల్లే నా లైఫ్ సెట్ అయింది : కమెడియన్‌ ప్రవీణ్‌

Raj: సమంత శుభం తో రాజ్ ను జీవితభాగస్వామిని ఎంచుకుందా !

Blackbuck poaching case: కృష్ణ జింకల వేట కేసు: సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సోనాలి కు షాక్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

తర్వాతి కథనం
Show comments