Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ - చైనా మీడియా వార్ : ఇండియన్ జర్నలిస్టులంతా దేశం వీడాల్సిందే..

Webdunia
మంగళవారం, 13 జూన్ 2023 (10:50 IST)
భారత్ - చైనా దేశాల మధ్య మీడియా వార్ మొదలైంది. భారతీయ జర్నలిస్టులంతా తమ దేశం వీడాలని చైనా హుకుం జారీచేసింది. కావాలని కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా మరోసారి తన బుద్ధి చాటుకుంది. సరిహదుల్లో భారత్‌తో గిల్లికజ్జాలు పెట్టుకునే డ్రాగన్ ఈసారి మీడియాను లక్ష్యంగా చేసుకుంది. కొన్ని నెలల కిందట మన మీడియా ప్రతినిధులకు ముగ్గురు సహాయకులే ఉండాలంటూ పరిమితి విధించిన బీజింగ్.. ఇప్పుడు అక్కడ పనిచేస్తున్న ఏకైక భారతీయ జర్నలిస్టును జూన్ నెలాఖరులోగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. 
 
కొద్దిరోజుల క్రితం జిన్హువా, చైనా సెంట్రల్ టీవీ జర్నలిస్టుల వీసా పొడిగింపును భారత్ నిరాకరించింది. ఈ నేపథ్యంలో మన జర్నలిస్టులకు సహాయకుల సంఖ్యపై పరిమితి పెట్టిన డ్రాగన్, వారిని తామే ఎంపిక చేసి ఇస్తామని ప్రకటించింది. ఇప్పుడు భారతీయ జర్నలిస్టును వెళ్లిపోవాలని ఆదేశించింది. కాగా, చైనా ఆదేశాలతో ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) విలేకరి త్వరలో వచ్చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. 
 
ఈ ఏడాది ప్రారంభం వరకు చైనాలో నలుగురు భారత జర్నలిస్టులు ఉండేవారు. హిందూస్థాన్ టైమ్స్ జర్నలిస్టు గత వారాంతంలో వచ్చేశారు. ప్రసారభారతి, హిందూ పత్రిక జర్నలిస్టులకు ఏప్రిల్లో వీసాలను పునరుద్ధరించలేదు. పీటీఐ ప్రతినిధిని కూడా వెళ్లిపోవాలని కోరడంతో పొరుగు దేశంలో మన జర్నలిస్టులు ఎవరూ లేనట్లవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments